విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో వైఎసఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేదర సురేష్కుమార్ పాల్గొన్నారు. బుధవారం ధర్నాచౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో హత్యకు గురైన దళితులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 మంది దళితులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని ఈ కేసులపై సమగ్ర విచారణ జరపాలన్నారు. బాధిత దళిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. న్యాయం కోసం బాధితులకు అండగా నిలుస్తామని కార్యక్రమంలో పాల్గొన్ని సంఘీభావం తెలిపారు.
Prajavartha Online Telugu News