-శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు
విఅమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో భాగమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
Prajavartha Online Telugu News