Breaking News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *