గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఎన్నికల విధులను సమర్దవంతంగా చేపట్టిన నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో జరిగిన సభలో కలెక్టర్ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి వివిధ విధులను సమర్దవంతంగా చేపట్టిన ఈఆర్ఓలు కమిషనర్ కీర్తి చేకూరి, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి, సూపరిండెంట్లు సాంబశివరావు, ప్రసాద్ లను ప్రశంశాపత్రాలు, మెమోంటోలతో అభినందించారు.
Prajavartha Online Telugu News