Breaking News

Tag Archives: tirupathi

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు, 18 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. మంగళవారం  స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చాంబర్ నందు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022, గ్రాడ్యూయేట్ మరియు టీచర్ల కు సంబంధించి ఓటర్ల నమోదు పై జిల్లా కలెక్టర్ …

Read More »

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: సోమవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. అమ్మ వారి దర్శన అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానికి ముందు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి బాల కొండయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సాదర స్వాగతం పలికారు.

Read More »

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు సిజే, ఏపీ హైకోర్టు సీజే

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త: ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వారికి, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వారికి ఆలయ ముఖ ద్వారం వద్ద జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో లోకనాథం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ముందుగా వీరు ఆలయ ధ్వజ స్థంభంకు …

Read More »

వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయనం కేంద్రం వారు “వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ’ అనే అంశంపై మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈనెల 28 నుండి 30 సెప్టెంబర్ 2022వ తేదీల్లో శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం అలిపిరి రోడ్డు తిరుపతి లోని వృద్ధులకు నిర్వహించారు వృద్ధులకు నిర్వహించారు. మహిళా అధ్యయన కేంద్రం లెక్చరర్ డాక్టర్ కే .రాణి వృద్ధాశ్రమంలోని వృద్ధులను ఉద్దేశించి కౌన్సిలింలో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ ఒకే కుటుంబంల కలిసిమెలిసి ప్రతి పరిస్థితుల్లోనూ సర్దుకుపోతూ సామరస్యంతో …

Read More »

ఈనెల 27, 28 ముఖ్యమంత్రి పర్యటన… : జిల్లా కలెక్టర్, ఎస్. పి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27 న తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారని అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారని పర్యటనలో చిన్నపాటి లోపాలు కూడా తలెత్త రాదని విధులు కేటాయించిన అధికారులు అప్రమత్తంగా వుండి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. ఆదివారం  రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , జెసి డీకే బాలాజీ లు సమావేశమై …

Read More »

ఎం ఎస్ ఎం ఈ ల ఏర్పాటు కు చర్యలు చేపట్టండి : డి.ఆర్.ఓ.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచ్చారం కల్పించాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. శనివారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి.ఆర్.ఓ. సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు మండల స్థాయి లో జరిగే సమావేశాలలో పరిశ్రమల ప్రాధాన్యతల పై అవగాహన కల్పించాలని …

Read More »

కాఫీ పౌడర్‌తో 50 అడుగుల వెంకన్న చిత్రం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్ట్‌లో నమోదయింది. తిరుమలకు చెందిన పల్లి చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్‌. బియ్యపు, చింతగింజలపై జాతీయ పతాకం, జాతీయ నేతలు, శ్రీవారు, అమ్మవార్ల బొమ్మలు వేసి పేరు పొందాడు. ఈ నెల 27నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మురంశెట్టి రాములు సూచన మేరకు 50 అడుగుల క్లాత్‌పై …

Read More »

రెండవ దశ మనబడి నాడు నేడు పనులు పూర్తి చేయాలి

-ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు శాతం పక్కాగ ఉండాలి -జగనన్న విద్యా కానుక కార్యక్రమo పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలి -పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు వంద శాతం పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర …

Read More »

అక్టోబర్ 2 న భూ హక్కు పత్రాలు పంపిణీకి సిద్దం కావాలి : జిల్లా కలెక్టర్

-స్పందన వినతులు నిర్ణీత సమయం లోపు పరిష్కరించాలి… తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో స్పందన వినతులకు సంబంధించి పరిష్కారం నాణ్యతగా నిర్ణీత సమయం లోపు చేసి, పరిష్కార అనంతరం సంబంధిత అధికారి అర్జీదారునితో కలిసిన సేల్ఫీ ఫోటో స్పందన పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ అన్నిజిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, …

Read More »

ఘనంగా 21 నుంచి 27 వరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాలు: జిల్లా కలెక్టర్

-పర్యాటక కేంద్రానికి నిలయమైన తిరుపతి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం -జెండా ఊపి ర్యాలిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: పర్యాటక కేంద్రంగా ఉన్న తిరుపతి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అలిపిరి నుండి 21 నుంచి 27 వరకు పర్యాటక శాఖ వారు జరిపే వారోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ర్యాలీని జెండా ఊపి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా …

Read More »