-సచివాలయాల సిబ్బంది సేవలు మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు చర్యలు చేపాడుతాం -ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించడమే సచివాలయాల ముఖ్య ఉద్దేశ్యం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: గ్రామ సచివాలయాలలో మరిన్ని సేవలను మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని, ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు అందించడమే సచివాలయం వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం అని తనపల్లి గ్రామ సచివాలయ సందర్శన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. బుధవారం మధ్యాహ్నం తనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, …
Read More »Tag Archives: tirupathi
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు చేపట్టిన జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం తిరుపతి లోని బైరాగి పట్టెడ లోని ఎం.జి.ఎం పాఠశాలలోని విద్యార్థి, విద్యార్థినులకు డీవార్మింగ్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ మెరుగు పరిచి ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దడమే …
Read More »జి. బాల కృష్ణ ప్రియ కు డాక్టరేట్ ప్రదానం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయములోని కంప్యూటర్ సైన్సు విభాగమునకు చెందిన పరిశోధక విద్యార్థిని జి. బాల కృష్ణ ప్రియ కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ కార్యాలయము ఒక ప్రకటనలో తెలియజేసింది. కంప్యూటర్ సైన్సు విభాగపు ఆచార్యులు డా|| యమ్. ఉషా రాణి పర్యవేక్షణలో “ఎ నోవెల్ డీప్ లెర్నింగ్ ఫ్రేంవర్క్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ తెలుగు టెక్స్ట్ యూసింగ్ ఎన్హాన్స్డ్ బై-యల్ యస్ టి యం” అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు …
Read More »బ్యాంకర్ లు సకాల౦లో లబ్ది దారులకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: బ్యాంకర్ లు లబ్దిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో లీడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోనీ బ్యాంకర్స్ అందురు సకాల౦లో లబ్దిదారులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. బ్యాంకర్లు అందరూ కూడా పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను పరిశీలించి లబ్ది …
Read More »భారతదేశం 2025-26 నాటికి $300 బిలియన్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతులను చేరుకోవడానికి కట్టుబడి ఉంది…
-కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ -భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారాన్ని సందర్శించిన రాజీవ్ చంద్రశేఖర్ -వ్యక్తిగతంగా, భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారంలో ఈ రోజు గడపడం -ప్రధాని పుట్టినరోజుకు ఒక రోజు ముందు తిరుపతి లో ఉండడం ఆనందదాయకం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: భారతదేశం 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదని ఉద్ఘాటిస్తూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు …
Read More »మస్కట్ లో తెలుగు మహిళకు వేధింపులు…
– బాధితురాలి వైరల్ వీడియోపై స్పందించిన ‘ఏపీ మహిళా కమిషన్’ – దేశానికి రప్పించేందుకు పూనుకున్న కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుపతి జిల్లా నుంచి ఉపాధికి గల్ఫ్ దేశానికి వెళ్లిన మహిళను అక్కడి ఏజెంట్లు వేధిస్తున్న వైనంపై ‘ఏపీ మహిళా కమిషన్’ తీవ్రంగా స్పందించింది. తక్షణమే బాధితురాలిని రక్షించి దేశం తీసుకొచ్చేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకొస్తే… …
Read More »లింగ నిర్ధారణ చట్టం పై వర్కుషాప్…
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యూ. శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం లింగ నిర్ధారణ చట్టం పైన వివిధ అనుబంధ శాఖల అధికారులు ప్రతినిధులకు వర్కుషాప్ నిర్వహించబడింది. ప్రస్తుతం సమాజం లో జన్మిస్తున్న మగ ఆడ శిశువుల నిష్పత్తి 1000:943 మాత్రమే ఉన్నదని ఈ సంఖ్య క్రమేపి తగ్గిపోతే భవిష్యత్తు లో ప్రమాద మని కనుక ప్రజలు లింగవివక్షత చూప రాదని అలాగే లింగ నిర్ధారణ …
Read More »ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం తిరుపతి జిల్లా సర్వ సభ్య సమావేశం…
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం తిరుపతి జిల్లా సర్వ సభ్య సమావేశం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంనందు మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధికారుల కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ప్రసాద రావు ఎన్నికల అధికారి గా వ్యవహరించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు గా K.M.E..ప్రసాద్ (సహాయ వ్యవసాయ సంచాలకులు, భూసార పరీక్షా కేంద్రం తిరుపతి), ఉపాధ్యక్షులు గా తిరుపతి పట్టణ వ్యవసాయ అధికారి ప్రపూర్ణ, కార్యదర్శి …
Read More »నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : జెఈవో వీరబ్రహ్మం
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయని, అధికారులు సమష్టిగా పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో వీరబ్రహ్మం కోరారు. వివిధ విభాగాల అధికారులతో జెఈవో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వాహన సేవలు తిలకించేందుకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేక …
Read More »గంగమ్మ చెంతకు పైనాపిల్ గణనాథుడు…
-ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వినాయకుడు -1116 కేజీల లడ్డూ భక్తులకు ఉచితంగా పంపిణీ -యువతను ఆకట్టుకున్న ఉట్లోత్సవం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు రోజులుగా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిచ్చిన భారీ పైనాపిల్ గణనాథుడు ఆదివారం జరిగిన నిమజ్జనంతో గంగమ్మ చెంతకు చేరాడు. తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట గ్రామంలోని బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పైనాపిల్ వినాయకున్ని వేలాది మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు. వినాయక …
Read More »
Prajavartha Online Telugu News