Breaking News

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం కొత్తపేట,కే బీ ఎన్ కళాశాల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, మరియు రక్త పరీక్షలు, ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 122 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పీ వీ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు,గవర్నమెంట్ డెంటల్ డాక్టర్స్ ,శంకర నేత్ర చికిత్సాలయ కంటి వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజన మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *