Breaking News

జగనన్న సురక్ష కింద ప్రతి వాలంటీర్ రానున్న 5 రోజుల్లో వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి డేటా సేకరించాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.

 

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాత్రి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీ, నారాయణపురంలో సచివాలయం నెం 3, 4 పర్యటించి కొన్ని ఇళ్ల కు సంబందించి డేటా సేకరణ వివరాలు పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష ద్వారా అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న, ఇంకా కొద్ది మంది తమకు పథకాలు అమలు కావడం లేదని అర్జీలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆక్రమంలో ప్రస్తుతం జూన్ 30 వరకు క్షేత్ర స్థాయి లో వాలంటీర్లు పర్యటన చేసి, వారికి భరోసా కల్పించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *