Breaking News

Telangana

వడ్డీ రాయితీతో పన్ను చెల్లింపుకు నెలాఖరు వరకే గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంగా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తే, వాటి పై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నెలాఖరు వరకే గడువు ఉందని నగర కమీషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కూడా ప్రకటించిందని, మార్చి నెలాఖరులోపు పన్ను చెల్లించకుంటే వడ్డీ …

Read More »

ఎన్నికల విధుల నిర్వహణపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోకూడదని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల నిర్వహణపై పశ్చిమ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, ఏఈఆర్ఓలు, సూపరిండెంట్లతో మంగళవారం కమిషనర్ చాంబర్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం …

Read More »

జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల భద్రత ఎంతో ముఖ్యమని, అందుకు తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గన్నవరంలో …

Read More »

ఎంఎస్ఎంఈ సర్వే పక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

-జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలి -ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అధికారులు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ, జర్నలిస్ట్ హౌసింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఎంఎస్ఎమ్ఈ సర్వే, జర్నలిస్ట్ హౌస్ సైట్స్, …

Read More »

సార్వత్రిక ఎన్నికల నోడల్ అధికారులు వారి విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సార్వత్రిక ఎన్నికలు- 2024 విధులకు కేటాయించబడిన నోడల్ అధికారులకు ఎన్నికలలో నిర్వహించవలసిన విధులపై వారి సన్నద్ధత కొరకు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి సమీక్ష సమావేశం …

Read More »

వ్యవసాయ మరియు అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

-ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మరియు అనుబంధ శాఖలపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సమీక్షించి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు ఉద్యాన శాఖ, …

Read More »

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రకటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయి. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని ప్రగాఢ ఆకాంక్ష. ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సాగిన …

Read More »

వైసీపి ది అధికార దాహం…బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం

-బిజెపిలో చేరిన మహిళలు.. -దేశాభివృద్దికి బాటలు వేసిన ప్రధాని నరేంద్రమోదీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి అంతులేదు.. అంతే కాదు సిద్దం సభలో ముఖ్యమంత్రి మాటలు ఎవరిని వంచించేందుకు అంటూ బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాతూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దం సభలో వల్లెవేసిన మాటలు అన్నీ ఆయన అధికార దాహానికి తార్కాణం అన్నారు. మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. …

Read More »

జనసేన గయాసుద్దీనికి సీటు ఇవ్వాలని కొవ్వొత్తులతో ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టికెట్‌ను జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్‌ చైర్మన్‌ అయిన షేక్‌ గయాసుద్దీన్‌ (ఐజా)కు కేటాయించాలని జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ను కోరుతూ వందలాది మంది మహిళలు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం భవానిపురంలోని దుర్గమ్మ ఫ్లైఓవర్‌ వద్ద నుంచి స్వాతి సెంటర్‌ వరకు కొవ్వొత్తులు చేతబూని మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై పవన్‌కళ్యాణ్‌ అంటూ మహిళలు నినాదాలు చేశారు. అలాగే …

Read More »

2024-25 వార్షిక బడ్జెట్ పై కౌన్సిల్ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర సమగ్ర అభివృద్దే ధ్యేయంగా నగర పాలక సంస్థ 2024-25 వార్షిక బడ్జెట్ ను రూ.1497.14 కోట్ల అంచనాలతో సోమవారం నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్సీలు కె.ఎస్.లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎంఎల్ఏలు మద్దాలి గిరిధర్, మహ్మద్ ముస్తఫా, డిప్యూటీ మేయర్లు, …

Read More »