-భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికల రిజిస్ట్రార్గా, అదనపు ప్రెస్ రిజిస్ట్రార్గా కూడా ఆయన వ్యవహరిస్తారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార &ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS) అధికారి రాజేందర్ చౌదరి సోమవారం విజయవాడలోని ఓ/ఓ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఆంధ్రప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం)గా బాధ్యతలు స్వీకరించారు. రాజేందర్ చౌదరి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1997 బ్యాచ్కి చెందినవారు. ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ …
Read More »Telangana
రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు
-గతేడాది వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాదీ వర్తింపు.. -వినియోగదారులపై భారం లేకుండా 2024-2025 ఏడాదికి టారిఫ్ రూపకల్పన.. -సగ్గు బియ్యం తయారీ మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు కొంతమేర ఉపశమనం.. -మొత్తం రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. -జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ ను రూపొందించడం జరిగిందని ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి అన్నారు. …
Read More »జిల్లాలో 970 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 96 కోట్ల లఖ్పతి దీదీ పథకం ద్వారా లబ్ది… : జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో లఖ్పతి దీదీ పథకం ద్వారా 970 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 96 కోట్ల రూపాయల చెక్ ను కలెక్టర్ అందజేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా లఖ్పతి దీదీ పథకంపై వర్చువల్ గా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తక్కువ వడ్డీకే …
Read More »సులభతర ప్రయాణానికి ప్రగతి బాటలు జాతీయ రహదారులు
-రాష్ట్రంలో 35 జాతీయ రహదారుల ప్రాజెక్టులను గుర్ గ్రామ్ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -జాతీయ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.29,395 కోట్లతో 1,134 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం.. -రూ.లక్ష కోట్లకు పైగా వ్యయంతో దేశవ్యాప్తంగా 114 జాతీయ రహదారి ప్రాజెక్టులు.. -దేశవ్యాప్తంగా నేడు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో 30 శాతం ప్రాజెక్టులు ఏపీకి చెందినవే.. -ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవేలోని హరియాణా సెక్షన్ (ఢిల్లీ -గుర్ గ్రామ్), ఏపీ సహా దేశవ్యాప్తంగా …
Read More »క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయం అవసరం
– ఎన్నికల విధులపై పూర్తిస్థాయి అవగాహన, నిబద్ధత ముఖ్యం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి జిల్లాస్థాయి ఎన్నికల అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయం కీలకమని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ నిర్వహణ (ఈఈఎం), మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అధికారులు, సిబ్బందికి కలెక్టర్ …
Read More »స్పందనలో వచ్చిన ఆర్జీలను శాఖాపరమైన అధికారులు నిర్థేశించిన గడువులోగా పరిష్కరించాలి..
-ఆర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించడమే అధికారుల ప్రధాన లక్ష్యం.. -జిల్లాస్థాయి స్పందనలో 121 ఆర్జీలు నమోదు. -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు నిర్థేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఆర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, …
Read More »బ్రెయిలీ ప్రెస్ లో ప్రూఫ్ రీడర్, బైండర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థకు చెందిన బ్రెయిలీ ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ మరియు బైండర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్.ఏ. కుమార్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న బ్రెయిలీ ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ పోస్ట్ – 1, బైండర్ పోస్ట్ – 1 ఖాళీలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామని అయన తెలిపారు. …
Read More »విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు, ఉపకరణాల పంపిణీ
– విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహకార సంస్థ సమకూర్చిన రూ. 3,05,500 విలువైన ల్యాప్టాప్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు ఒక్కొక్కటి రూ. 35 వేలు విలువ చేసే ఎనిమిది ల్యాప్టాప్లను విద్యార్థులకు అందజేశారు. అదే విధంగా …
Read More »జీజీహెచ్కు అత్యాధునిక అంబులెన్సులు
– ఆసుపత్రిలో పటిష్టంగా అత్యవసర వైద్య సేవల వ్యవస్థ – విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జీజీహెచ్కు రెండు అత్యాధునిక లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు అందుబాటులోకి రావడంతో రోగుల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు వీలవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. సోమవారం విజయవాడలోని న్యూ జీజీహెచ్లో రూ. 55 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో సమకూర్చిన రెండు అత్యాధునిక అంబులెన్సులను ఎంపీ కేశినేని నాని.. విజయవాడ సెంట్రల్ …
Read More »రాహుల్ గాంధీతోనే 30 లక్షల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు
-పంచ సూత్రాలతో పక్కా ప్రణాళిక.. -మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే దేశంలోని యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చారిత్రాత్మక అవసరమని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో …
Read More »
Prajavartha Online Telugu News