Breaking News

Monthly Archives: November 2024

నారా కుటుంబంలో తీవ్ర విషాదం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి …

Read More »

నిస్వార్ధంగా పనిచేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు సర్కిల్ వన్ లోని సి డి ఒ లు, సోషల్ వర్కర్లు, సి ఒ లు , ఆర్ పి లు, డ్వాక్రా సంఘాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా ప్రతి విభాగం నిస్వార్ధంగా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతం చేయడానికి డ్వాక్రా సంఘాలకు, కమ్యూనిటీ …

Read More »

నారా రామ్మూర్తి నాయుడు సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

-రామ్మూర్తి మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి ప‌ట్ల ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యే గా రామ్మూర్తి నాయుడు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు ఎన‌లేనివి. పార్టీకి అందించిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి, చిరస్మరణీయం. ఆయ‌న మ‌ర‌ణం నారా కుటుంబానికి తీర‌ని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని …

Read More »

జర్నలిజం జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) పుస్తకావిష్కరణ

-పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రచయిత సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం రచించిన జర్నలిజం-జర్నలిస్టులు (జర్నలిజం బేసిక్స్) ప్రత్యేక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ నందు శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. జాతీయ పత్రిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జర్నలిస్టులకు మంత్రి పార్థసారథి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ …

Read More »

గ‌త ప్ర‌భుత్వంలో టిడ్కో ఇళ్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన మంత్రి నారాయ‌ణ‌

-ల‌బ్దిదారుల కేటాయింపు,డీడీల చెల్లింపుల్లో అవ‌క‌త‌వ‌ల‌పై ఎమ్మెల్యేల ఫిర్యాదు -అసెంబ్లీలో టిడ్కో ఇళ్ల‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి -మాజీ సీఎం పిచ్చి ప‌నుల‌లో ల‌బ్దిదారుల‌కు తీవ్ర ఇబ్బందుల‌న్న నారాయ‌ణ‌ -టిడ్కో ఇళ్ల‌కు మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రుణ స‌మీక‌ర‌ణ ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్న మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్య‌మంత్రి చేసిన పిచ్చి ప‌నుల‌తో టిడ్కో ఇళ్ల ల‌బ్దిదారులు,కాంట్రాక్ట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ల‌బ్దిదారుల ఎంపిక‌,బ్యాంకుల‌కు …

Read More »

రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలి

-నియోజకవర్గంలో చెరువుల మరమ్మత్తులు, తాగునీటి అవసరాలు తీర్చాలి -జలవనరుల శాఖ మంత్రిని కోరిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లాలో రైతులు, ప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా పీలేరు మండిపల్లె నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లె రిజర్వాయర్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసేందుకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల …

Read More »

పత్రికా స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత

-సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పని చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ (నేషనల్ ప్రెస్ డే) శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని జాతీయ …

Read More »

గ‌ర్భ‌స్థ పిండ లింగ నిర్ధార‌ణ నిషేధ చ‌ట్టం ప‌టిష్ట అమ‌లుకు కృషి

– క్షేత్ర‌స్థాయి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి: ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో గ‌ర్భ‌స్థ పిండ లింగ నిర్ధార‌ణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చ‌ట్టం ప‌టిష్టంగా అమ‌ల‌య్యేలా వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలని, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా ప‌టిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా సూచించారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా అధ్య‌క్ష‌త‌న లింగ నిర్ధార‌ణ …

Read More »

ధాన్యం కొనుగోలులో రైతుల‌కు పూర్తి భ‌రోసా

– అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో క్రియాశీలంగా ప‌నిచేయాలి. – విజ‌య‌వాడ డివిజ‌న్ ప‌రిధిలో 45 కొనుగోలు కేంద్రాలు. – ధాన్యం సేక‌ర‌ణ విధానంపై రైతుల‌కు పూర్తి అవగాహ‌న క‌ల్పించాలి. – విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు శ్రేయ‌స్సు దృష్ట్యా రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ధాన్యం కొనుగోలులో అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో క్రియాశీలంగా ప‌నిచేయాల‌ని విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య అన్నారు. శనివారం విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆర్‌డీవో చైత‌న్య‌.. ఖ‌రీఫ్ (2024-25) ధాన్యం …

Read More »

అమ్మ సౌందర్యమే శాశ్వతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ హితమే భక్తికి పరమార్థం కావాలని, అప్పుడే కనకదుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఎస్ కే పి వి హిందూ హైస్కూల్ కమిటీ సంయుక్త నిర్వహణలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ప్రవచన కార్యక్రమం శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమైంది. గరికపాటి మాట్లాడుతూ అమ్మవారి సౌందర్యం మాత్రమే శాశ్వతమైందని, మిగిలినదంతా ఎప్పటికైనా రూపుమాసిపోతుందన్నారు. దుర్గా అనే పదాన్ని …

Read More »