-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రెండు నెలల్లో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ఇతర అవసరాలకు …
Read More »Daily Archives: January 28, 2025
టెన్త్ లో వంద శాతం ఫలితాలు సాధించాలి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ కు ధీటుగా రాబోయే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఎంజేపీ గురుకుల పాఠశాల ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతి పత్రమందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »ఉషా ఉతుప్, మృణాల్ ఠాకూర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తనైరా యొక్క మొదటి బ్రాండ్ చిత్రం
-ఉషా ఉతుప్ మరియు మృణాల్ ఠాకూర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తనైరా యొక్క మొదటి బ్రాండ్ చిత్రం , ఇది పనితనం మరియు వారసత్వం ను వేడుక జరుపుకుంటుంది -ప్రతి డ్రెప్లో నమ్మకం, పారదర్శకత మరియు శాశ్వత గాంభీర్యంతో సమాచారంతో కూడిన ఎంపికలు చేయడానికి వినియోగదారులకు అధికారం ఇస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టాటా గ్రూప్ కు చెందిన తనైరా తమ మొట్టమొదటి బ్రాండ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది, విశ్వాసం, ప్రామాణికత, స్వచ్ఛత, హస్తకళా నైపుణ్యం, వైవిధ్యభరితమైన భారతీయ చేనేత వంటి వాటి …
Read More »ఘనంగా పి.బి. సిద్ధార్థ ఎన్.సి.సి. విజయంత పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయంత 2.0 (భారత సైన్యంలో మొదటి స్వదేశీయుద్ధట్యాంకు) పేరుతో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బాలికల ఎన్.సి.సి. బెటాలియన్ (4ఎ) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడలు, ఇతర పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 14 స్కూళ్లు, ఆరు కాలేజీల నుంచి 537 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రన్నింగ్, త్రోబాల్, పోకో, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడాంశాల్లో జరిగిన పోటీల్లో ఓవరాల్ మొదటి బహుమతి నలంద కళాశాల, …
Read More »విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (FMGలు) పై జరిగిన నిరసన దృష్ట్యా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ -19 మహమ్మారి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తమ M.B.B.S కోర్సులో కొంత బాగాన్ని ఆన్ లైన్ లో పూర్తి చేసిన విదేశీ వైద్య విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (P. R) మంజూరు చేయాలని ఏ.పి మెడికల్ కౌన్సిల్ (APMC)ని అభ్యర్థించారు. చాలా మంది విదేశీ వైద్య విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చి ఆన్లైన్లో తమ వైద్య విధ్యను కొనసాగించిన తరువాత ఆఫ్లైన్ మోడ్లో కోర్సు …
Read More »జాబ్ మేళాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్దిసంస్దఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగానిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండాసంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్దిసంస్ద, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30-01-2025 వ తేదీన మంగళగిరి మరియు ఫిరంగిపురం నందు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు …
Read More »ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా సోమవారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని …
Read More »పశువులకు నట్టల నివారణ కార్యక్రమము
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో ది.20.01.2025 నుండి ది.31.01.2025 వరకు జరుగుచున్న పశు వైద్య శిబిరములలో భాగముగా ఈరోజు అనగా ది.28.01.2025 నవెటర్నరీ పాలీ క్లినిక్ గుంటూరు వారు గుంటూరు పట్టణము నెహ్రనగర్ లోని గోసంరక్షణసంఘం వారి గోశాలలో నట్టల నివారణ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 656 ఆవులకు మరియు 155 దూడలకు నట్టల నివారణ మందు త్రాగించారు.ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ …
Read More »ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి జిల్లాను అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్దిగా చేసి అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల …
Read More »డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, తమ రోజువారీ పర్యటనల్లో ట్రేడ్ లైసెన్స్ లను కూడా తనిఖీ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, మస్టర్ పాయింట్స్ తనిఖీ, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు …
Read More »
Prajavartha Online Telugu News