Breaking News

Daily Archives: March 26, 2025

పార‌ద‌ర్శ‌కంగా వృత్తి ప‌న్ను వ‌సూళ్లు

– కార్పొరేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ప‌న్నుల శాఖ ద్వారా వృత్తి ప‌న్ను వ‌సూలు – రాష్ట్ర ప‌న్నుల జాయింట్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ప్ర‌శాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృత్తి ప‌న్ను వ‌సూళ్ల‌ను స‌ర‌ళీకృతం చేసి మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని విజ‌య‌వాడ 1, 2 డివిజ‌న్ వాణిజ్య ప‌న్నుల శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ ఎస్‌.ప్ర‌శాంత్ కుమార్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. వాణిజ్య ప‌న్నుల శాఖ ద్వారా వృత్తి ప‌న్నుదారుల నుంచి ప‌న్నుల …

Read More »

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పధకము నందు ఋణము కొరకు మైనారిటీ వర్గముల నుండి ధరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి కల్పన పధకము నందు లబ్దిపొందుటకు జిల్లాలోని మైనారిటీ వర్గములు అనగా, ముస్లిములు, క్రెస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు మరియు పారశీకుల నుండి ధరఖాస్తులు ఆహ్వానింపబడుచున్నవని కార్యనిర్వాహక సంచాలకులు, మైనారిటీ కార్పొరేషన్, యన్. టి. ఆర్. జిల్లా వారు తెలియజేసినారు. ఈ పధకము కింద గరిస్ట ప్రాజెక్టు వ్యయ పరిమితి : తయారీ రంగానికి రూ.50.00 లక్షలు మరియు సేవ రంగానికి రూ. 20.00 లక్షలు. ప్రాజెక్టు ఏర్పాటు చేయు ప్రాంతమును, లబ్దిదారుల వర్గీకరణను బట్టి కేంద్ర …

Read More »

డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్‌డీఓ ఛైర్మన్‌కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి లో భాగ‌మైన విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ …

Read More »

ఏపీలో భూగర్భఉష్ణ శక్తి ఉత్పత్తి ప్లాంట్ ప్రతిపాదనలు లేవు

-కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భఉష్ణ శక్తి (Geothermal Energy) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భూఉష్ణ శక్తిపై పరిశోధనలు, దేశవ్యాప్త అధ్యయనం భారత ప్రభుత్వం …

Read More »

కేంద్ర‌మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల సమావేశానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజరు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఎన్డీయే ఎంపిల స‌మావేశంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మిలోని పార్ల‌మెంట్ స‌భ్యుల‌ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు, కేంద్ర ప‌థ‌కాల అమ‌లు, నిధుల అవ‌స‌రాల‌ గురించి తెలుసుకునేందుకు కేంద్ర‌మంత్రుల‌కు కొంత‌మంది ఎంపిల‌ను గ్రూపులుగా అప్ప‌గించి ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి స‌మావేశం కావాల‌ని ఆదేశించింది. కేంద్ర‌మంత్రి హార్టీప్ సింగ్ కి అధ్య‌క్ష‌త‌న వున్న ఎన్డీయే ఎంపిల గ్రూపులో …

Read More »

ఇఫ్తార్‌ విందుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ‌

-ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్ధూలో రంజాన్‌ ముందస్తు శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి …

Read More »

కలక్టర్ ప్రతిపాదించిన 11 అంశాలకి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం

అమరావతి/ వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యటక అనుబంధ, ఇరిగేషన్, జాతీయ రహదారులు తదితర అంశాలకు చెందిన కలక్టర్ ప్రతిపాదించిన 11 అంశాలకి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా ఎర్రకాలువ ఆధునీకరణ, తొర్రిగడ్డ పథకం, ఉపాధిహామీ పథకం కింద 200 నుంచి 400 మంది చిన్న , సన్నకార రైతులకి ఉపాధిహామీ పని దినాలు , కడియం నర్సరీలలో కాఫీ గార్డెన్స్ , నరేగా పొడిగింపు, రైల్వే శాఖ ఆధీనంలో ఉన్న భూమి అప్పగింత విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు …

Read More »

నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు లైన్ క్లియర్

-త్వరలోనే సంబంధిత రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ: మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబునాయుడు: మంత్రి దుర్గేష్ -కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ -ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు కేబినెట్ దృష్టికి ఇన్ ఫుట్ సబ్సిడీ సమస్యను తీసుకువచ్చిన మంత్రి దుర్గేష్ -ఎట్టకేలకు నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసే దిశగా అడుగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు ఎర్రకాలువ ముంపు వల్ల …

Read More »

ఆప్కో చేనేత వస్త్రాల పై ప్రత్యేక ఆఫర్లు

-ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని 30 నుంచి 45 శాతం వరకు డిస్కౌంట్ -బి హరి ప్రసాద రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సరి కొత్త వస్త్రాలపై 30% డిస్కౌంట్ మరియు ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 45% డిస్కౌంట్ ను ఇస్తున్నట్లు ఆప్కో రాజమండ్రి మండల వాణిజ్య అధికారి బి . హరి ప్రసాద రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా …

Read More »

ప్రమాదాల బారిన పడిన అసంఘటిత కార్మికులు మార్చి 31, లోగా ఈ-శ్రమ్ ఇన్సూరెన్సు క్లెయిమ్ చేసుకోండి

-2022 మార్చి 31 న లేదా అంతకు ముందు జరిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి బి ఎస్ ఎమ్ వలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు అయ్యి, ప్రమాదము నకు గురయ్యి మరణించిన (లేదా) శాశ్వత అంగవైకల్యము (లేదా) పాక్షిక అంగవైకల్యము కల్గిన అసంఘటిత కార్మికులకు ఆక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ కల్పించే ఉద్దేశ్యంతో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వము వారు ఒన్ టైం ఎక్స్-గ్రేషియా చెల్లింపు నిమిత్తం ఆగష్టు, 2023 లో ఎక్స్ …

Read More »