Breaking News

Daily Archives: August 14, 2026

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో APSRTC–JAC కీలక ముందడుగు

-40 అంశాలపై సామరస్యపూర్వక చర్చలు – 35 అంశాలకు పరిష్కారం -5 అంశాలు ప్రభుత్వ పరిశీలనకు..76 కుటుంబాలకు Compassionate Appointments -6–7 నెలల్లో సుమారు 1,550 కొత్త బస్సులు – ప్రయాణికులు, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గింపు -EV బస్సులతో ఉద్యోగాలు పోవు – బస్సుల సంఖ్య పెరుగుతుంది: VC&MD శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, IPS విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (APSRTC)లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంస్థ ప్రయోజనాల పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన …

Read More »

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శివ ప్రసాద్, ఐ.ఎఫ్. ఎస్.

-ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణీకుల భద్రత, మెరుగైన సేవలే లక్ష్యమని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివ ప్రసాద్, ఐ.ఎఫ్. ఎస్. ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ లోని తన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ వి సి.& ఎం.డి. బాల సుబ్రమణ్యం, ఐ.పి.ఎస్.ని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్)  రాఘవ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంజినీరింగ్) …

Read More »

ప్ర‌త్యేక గ్రీవెన్స్‌తో స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం

– విజ‌య‌వంతంగా నియోజ‌క‌వ‌ర్గ‌స్థాయి పీజీఆర్ఎస్‌ – అర్జీల ప‌రిష్కారంపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు నియోజకవర్గ స్థాయి ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) దోహ‌దం చేస్తోంద‌ని.. ఈ ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా ముందుకెళ్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) అన్నారు. ఒక నెల …

Read More »

త్రివర్ణ శోభిత లైటింగ్ తో ఆకర్షణీయంగా అలంకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, హిందూ కాలేజీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు సెంట్రల్ డివైడర్లు, కంకరగుంట, మణిపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, దండి మార్చ్, గుజ్ఙనగుండ్ల, చుట్టగుంట జంక్షన్లను కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు త్రివర్ణ శోభిత లైటింగ్ తో ఆకర్షణీయంగా అలంకరణ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో జాతీయ పతాకం వర్ణంలో మెరుస్తున్న కార్యాలయాలు, డివైడర్లు, జంక్షన్ లు నగరంలో దేశభక్తియుత …

Read More »

స్వాతంత్ర్య స్పూర్తిని, త్రివర్ణ పతాక గౌరవాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ స్వాతంత్ర్య స్పూర్తిని, త్రివర్ణ పతాక గౌరవాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే సంకల్పంతో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని చేయడం జరిగిందని నగర పాలకసంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం, జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం ”హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా నగరంపాలెం లోని మూడు బొమ్మల సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు …

Read More »

వేగవంతంగా సాగుతున్న బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు

-విస్తరణ ప్రభావిత భవనాల్లో 90 శాతం తొలగింపు -డ్రైన్ నిర్మాణంలో అడ్డుగా ఉన్న చెట్లలో వీలున్నవాటిని ట్రాన్స్ లొకేషన్ -విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ -కల్వర్ట్ ల నిర్మాణం వేగవంతం….కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్ విస్తరణలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, విస్తరణలో ప్రభావితమవుతున్న 73 చెట్లను ఆచార్య …

Read More »

సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్తాయిలో అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 17 నుండి గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్తాయిలో అమలు చేయాలని నగర పాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ స్పష్టం చేశారు. నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం ఉన్నందున ఆగస్ట్ 17 …

Read More »

ఘనంగా రమేష్ హాస్పిటల్స్ 38వ వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, నేడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు వారి స్వస్థలానికే చేరువ చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంపాదించిన సేవా సంస్థగా నిలిచింది. ప్రస్తుతం రమేష్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా …

Read More »

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు రోడ్డు లోని సీతారాంపురం మైసూర్ కేఫ్ ఎదురుగా ఐకాన్ పబ్లిక్ స్కూల్ వద్ద నుండి 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం “ఘర్ ఘర్ తిరంగా – హర్ ఘర్ తిరంగా” తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి …

Read More »

గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన మహిళ మనోవికాస సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శుక్ర‌వారం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా సందేశ స్ఫూర్తితో 330 మంది కలసి తయారుచేసిన ఊలు జాతీయ జెండాలను మహిళా మనోవికాస సంస్థ సభ్యులు కే కుసుమ, యెన్ స్వర్ణ, పిఎల్ అన్నపూర్ణ ఠాగూర్ గ్రంథాలయమునకు విచ్చేసి కే రమాదేవి గ్రంథాలయాధికారికి మరియు 50 మంది విద్యార్థులు జాతీయ జెండాలు అందజేశారు స్వర్ణ మాట్లాడుతూ ఈ జాతీయ జెండాను …

Read More »