రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, పోలీస్, హౌసింగ్, అమ్మఒడి, త్రాగునీరు, భూఅక్రమణ, ఇండ్ల స్థలాలు,ఉపాధి, భూ సర్వే తదితర అంశాలకు సంబంధించి పన్నెండు మంది నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు.ప్రజాసమస్యలు సులభంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన పనితీరు తో అర్జిల్ని స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్.సి. డివిజన్ తహసీల్దార్ ఎ. శ్రీనివాస రావు, ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, వైద్య, ఆరోగ్య, ఆర్.డబ్ల్యూఎస్, లేబర్, కోఆపరేటివ్ , ఫైర్, డిఆర్ డిఎ , ఎపిఎస్ఆర్టీసీ , డివిజనల్ పంచాయతీ అధికారి, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ , ఏపీడబ్ల్యూపీ , ఇరిగేషన్, ఐసిడిఎస్, పశుసంవర్ధక, పరిశ్రమలు, తదితర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News