
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225s విజయవాడ అలయన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ అధ్యక్షురాలు ఎం శోభారాణి ఆధ్వర్యంలో అలయన్స్ వారోత్సవాలు భాగంగా నాల్గవ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ గవర్నర్ అలై జి వెంకటేశ్వరరావు, వి డి జి 2 అలై బి శ్రీనివాస్ యాదవ్,వి డి జి 3. గుడివాడ కృష్ణ కిషోర్, క్యాబినెట్ సెక్రటరీ రైల్వే శ్రీనివాస్, హాజరై చెట్లు నాటారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలయన్స్ వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు, అందులో భాగంగా వి డి జి టు ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ . పి. శాంతమ్మ పుట్టినరోజు సందర్భంగా గంగూరులోని స్పిన్నింగ్ మిల్ ఎదురుగా బందరు కాలువ ఒడ్డున మొక్కలు నాటడం జరిగిందన్నారు, ప్రస్తుత వాతావరణం లో కాలుష్యం విరిగిపోతుండడంతో ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటితే మనిషికి ప్రాణవాయువు లభిస్తుందని అందువలన ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును పెళ్లిరోజును పరిష్కరించుకొని చెట్టుని నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ విఆర్వో పి శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు మరీదు వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం శ్రీకాంత్, కటకం సతీష్ కుమార్, నందనవనం నర్సరీ అధినేత కిరణ్ కుమార్ ,తదితరులు హాజరై చెట్లు నాటారు
Prajavartha Online Telugu News