Breaking News

22న ప్రత్యేక లోక్ అదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోటార్ యాక్సిడెంట్ కేసులు, భూసేకరణ అంశాలలోని కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కనుక కక్షిదారులు తమ లాయర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *