రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు.అక్కడి బాలురు తో మాట్లాడారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని తెలియ చేశారు. అనాలోచితంగా ఏ పనులు చేయవద్దని శ్రద్ధగా చదువుకోవాలని, న్యాయబద్ధంగా జీవించాలన్నారు. క్షణిక ఆవేశానికి పోకుండా క్రమశిక్షణ, సహనం కలిగి ఉండాలని ప్రత్యూష కుమారి చెప్పారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని తెలియ చేశారు.
Prajavartha Online Telugu News