రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జరిగిన వేడుకలలో గౌరవ ప్రాంతీయ జైళ్ళ ఉపశాఖాధిపతి M.R. రవికిరణ్ వారు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతకావిష్కరణ గావించి, గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి S. రాహుల్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టర్ వారు ఇచ్చే ప్రోత్సహక అవార్డ్ లు ఈ కారాగారం కు సంబంధించి కారాగారం పర్యవేక్షణ అధికారి S. రాహుల్ గారు, జైలర్ కె. దుర్గా రమేష్ మరియు సిబ్బందిబి కామేశ్వరి, సీనియర్ అసిస్టెంట్.,కె ఎస్. సుబ్రహ్మణ్యం, చీఫ్ హెడ్వార్డర్., ఎస్ సన్యాసి దేముడు వార్డర్., జె. సాంబమూర్తి వార్డర్., వి. సూర్యనారాయణ, వీవింగ్ ఇన్ స్ట్రక్టర్ కలెక్టర్ అవార్డులు స్వీకరించారు.
Prajavartha Online Telugu News