Breaking News

కలెక్టర్ చొరవతో విజ్జేశ్వరం వద్ద గడ్డర్ ఎత్తు పెంపు

-నిడదవోలు వయా ధవళేశ్వరం పల్లె వెలుగు బస్సులకు మార్గం సుగమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లిగూడెం , నిడదవోలు డిపోలకు చెందిన పల్లె వెలుగు బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వాడపల్లి, రాజమహేంద్రవరం కు వెళ్లేందుకు విజ్జేశ్వరం వద్ద అడ్డంగా ఉన్న గడ్డర్ ఎత్తు పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తులు నేపథ్యంలో రాజమహేంద్రవరం కు వయా బ్యారేజ్ మీదుగా ఆర్టీసి బస్సులు తిరిగే అవకాశం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విజ్జేశ్వరం విద్యుత్ ప్లాంట్ సమీపంలో పల్లె వెలుగు బస్సులు వెళ్లేందుకు అనువుగా గెడ్డర్ ఎత్తు పెంచాలని జిల్లా కలెక్టర్ మాధవీలత ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా ధవళేశ్వరం సూపరింటెండెంట్ ఇంజనీర్ జీ. శ్రీనివాస రావు గెడ్డర్ ఎత్తు పెంచినట్లు కలెక్టర్ కు నివేదిక అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *