రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ట్రాన్స్ జెండర్ల హక్కుల పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు. వారి హక్కు లను వినియోగించున్నప్పుడే సామాజికంగా వారు బలపడ తారని అన్నారు. వారి స్వయం ఉపాధి కోసం అందుబాటులో ఉన్న సబ్సిడీల గురించి వారికి వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఈ సదస్సులో డి. ఎం. హెచ్. ఓ. అధికారులు డా. పి. లక్ష్మీ దేవి, డా. బి. రవి కుమార్, డా. ఆర్. మల్లిఖార్జున రావు, వివిధ ఎన్.జీ.ఓ ల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News