రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై సంయుక్త కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం పత్రికా ప్రకటన జారీ చేసియున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్ టన్నులు గా పేర్కొని యున్నారు. 12.01.2024 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 48,180 కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. అందుకుగాను 46,408 మంది రైతుల నుండి 2,27,355 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 45,353 FTO లకు గాను రూ.484 కోట్ల 32 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేయుట జరిగింది
Prajavartha Online Telugu News