-స్ధానిక సర్కిల్ కార్యాలయంలో అభినందన సభ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వరుసగా మూడవ సారి మన రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్ ఈ – టివీఎస్ఏన్ మూర్తి కెప్టెన్సీ లో పవర్ ఎ పి పవర్ సెక్టార్ ఇంటర్ సర్కిల్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకొన్న సందర్భముగా స్పోర్ట్స్ కౌన్సిల్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యములో సత్కార సభ నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక సర్కిల్ ఆఫీస్ నందు ఎపి ఎస్పీ డిసీల్ సంఘ అధ్యక్షులు డిఈ శామ్యూల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న క్రీడాకారులు అందరిని సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ టివీఎస్ఏన్ మూర్తి ఆధ్వర్యంలో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా వెయ్యడం జరుగుతుందనీ ఉద్యోగులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News