రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ది. 07.03.2024 న మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (MOA) రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. దినేష్ కుమార్ , సూపరింటెండెంట్, సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం యస్. రాహుల్ వారి మధ్య మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ అమలు చేయబడింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పూలమొక్కలు, గ్రౌండ్ కవర్ ఫోలేజ్ మొక్కలు, ఇండోర్ & అవుట్డోర్ మొక్కలు మరియు అవెన్యూ మొక్కలు వంటి అలంకారమైన మొక్కల ఉత్పత్తి కోసం నర్సరీని ఏర్పాటు చేసి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు అందించడానికి, కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి, బ్యూటిఫికేషన్ మరియు ల్యాండ్ స్కేప్ పనుల కోసం మంచి నాణ్యమైన మొక్కలను క్రమం తప్పకుండా మూడు సంవత్సరాలు సరఫరా చేయడం కోసం వారు నర్సరీ పెంపకం మరియు మొక్కల పెంపకంలో యువ ఖైదీలలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో జైళ్ల శాఖతో భాగస్వామ్యంలో ప్రవేశించారు. సాంకేతికతలు మరియు వారి ఖైదు ముగిసిన తర్వాత జీవితంలో గ్రామీణ & పట్టణ ప్రాంతాలలో సమాజంలో మంచి జీవితాన్ని గడపడానికి ఉపాధి లేదా ఆదాయ అవకాశాలను పొందుతూ గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడానికి ఇది ఒక శుభపరిణామము అని కమిషనర్ కె. దినేష్ కుమార్, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యస్. రాహుల్ ఆనందం వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమము నందు రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం యస్. రాహుల్, మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. పాండు రంగా రావు, సెంట్రల్ జైలు డిప్యూటి సూపరింటెండెంట్ యం. రాజకుమార్, మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానంద్ కుమార్ మరియు సురేష్ కుమార్, జైలర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News