Breaking News

Tag Archives: amaravathi

అమరావతి అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కావాలి…

-లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామసభల్లో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే చర్యల్లో భాగంగా లింగాయపాలెం మరియు ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో శుక్రవారం APCRDA ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ పాల్గొని, భూసమీకరణ మరియు గ్రామకంఠం సమస్యల పరిష్కారంపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాజధానిలో చేపట్టిన రహదారులు, ఎల్పీఎస్ (LPS) జోన్ల అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ నోటిఫికేషన్ …

Read More »

అమరావతిలో ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్‌ కు భూమి పూజ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోఅంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో, లింగాయపాలెం గ్రామంలోని APCRDA భవనం ఎదురుగా ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ హోటల్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్భూమిపూజకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ …

Read More »

బీసీ బిడ్డల విద్యకు ‘వసతి’ దన్ను

-పెనుకొండకు కొత్తగా 3 బీసీ హాస్టళ్లు మంజూరు -పరిగి, రొద్దం, సోమందేపల్లిలో ఏర్పాటు -రెండు బాలికల హాస్టళ్లు, ఒక బాలుర హాస్టల్ -వచ్చే విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్లు ప్రారంభం -విద్యార్థులను చేర్పించేలా బీసీ సంక్షేమశాఖాధికారులు కసరత్తు -హాస్టళ్ల మంజూరులో ఫలించిన మంత్రి సవిత కృషి -బీసీ బిడ్డలకు ఉన్నత విద్యే లక్ష్యం : మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవిత నేతృత్వంలో బీసీ …

Read More »

ప్ర‌భుత్వ బోధనాసుప‌త్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల భ‌ర్తీ జాబితా ఖ‌రారు

-శ‌నివారం జూమ్ కౌన్సెలింగ్‌ -వెనువెంటనే పోస్టింగ్ ఉత్త‌ర్వులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ బోధనాసుప‌త్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ఎంపిక చేసిన అభ్య‌ర్ధుల జాబితాను వైద్యారోగ్య శాఖ విడుద‌ల చేసింది. వీరికి శ‌నివారంనాడు పోస్టింగ్‌ల కేటాయింపు కోసం జూమ్ ద్వారా కౌన్సిలింగ్ జ‌ర‌గబోతుంది. జీరో వేకెన్సీ పాల‌సీలో భాగంగా పోస్టుల భ‌ర్తీని ఎప్ప‌టిక‌ప్పుడు చేప‌డుతున్నామ‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో భాగంగానే 216 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల భ‌ర్తీని త్వ‌ర‌లో పూర్తి చేస్తామ‌ని …

Read More »

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి

-రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ… వారానికో శంకుస్థాపన -వేగంగా పనిచేయాలి… అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి -స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు -పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యం -వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చు -జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి -కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా… ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు

-23 నెలల్లో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు.. అధికారులకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎంత కష్టపడి పథకాలను.. కార్యక్రమాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరుగుతోన్న పరిణామాలను గమనిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రభుత్వం …

Read More »

నేను కాదు… మనం

-క్షేత్ర స్థాయి ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవాలి -సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు చేద్దాం -టూరిజం అభివృద్ధి చేసిన జిల్లాకు అత్యధిక ఆదాయం -7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. …

Read More »

భారీ కంపెనీలకు అనుబంధ పరిశ్రమలుగా ఎంఎస్ఎంఈలు

-పారిశ్రామికాభివృద్ధి ఎకో సిస్టంలో ఎంఎస్ఈలు కీలకం -వైద్య ఖర్చులు తగ్గాలి… విద్యుత్ భారం తగ్గాలి -అసంఘటిత కార్మికులకూ నైపుణ్య శిక్షణ -బెస్ట్ పాలసీలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్లు -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏర్పడే భారీ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు అవకాశం ఉందని… వీటికి ఎంఎస్ఎంఈ రంగంలో ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్న సందర్భంలో ఏర్పడే ఎకో సిస్టంలో ఎంఎస్ఎంఈలు కీలక …

Read More »

పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

-కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్త అమలుకు నిర్ణయం -9 బెస్ట్ విధానాలను అమలు చేసే బాధ్యతను 10 మంది కలెక్టర్లకు అప్పగింత -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో బెస్ట్ విధానాలకు మెంటార్లను ప్రకటించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఉత్తమ విధానాలను ప్రజెంట్ చేయించడం ద్వారా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విధానం ద్వారా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన …

Read More »

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు

-బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించిన ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవం -మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఇలాంటి అవార్డులు రావాలి: సీఎం చంద్రబాబు -ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం: ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అభినందనలు తెలిపింది. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ …

Read More »