Breaking News

Tag Archives: amaravathi

చిన్నారులకు తల్లిపాలు అందించటంలో అలక్ష్యం వద్దు…

-మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా -రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్ కాంప్లెక్స్ ప్రారంభం -సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు సమకూర్చిన ఐటిసి -చిన్నారుల కోసం క్రీడా పరికరాల ఆవిష్కరణ, పుస్తకాల పంపిణీ -తల్లిపాల పట్ల అవగాహన ఉన్న బాలింతలకు ప్రత్యేక పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులకు తల్లి పాలను మించిన పోషకాహారం లేదని, పిల్లలకు తల్లిపాలు అందించటంలో ఎటువంటి అలక్ష్యం కూడదని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ …

Read More »

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో ప్రధాన కార్యదర్శులు సమావేశం…

-పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, పర్యావరణ సమస్యలపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య  బుధవారం  పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ …

Read More »

ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు పునర్ వైభవం

-చిరకాల స్వప్నం నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మన జాతీయ క్రీడ హాకీలో ఒలింపిక్స్ పతకం గెలుచుకోవాలని క్రీడాభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్యం గెలుచుకొని క్రీడాభిమానుల కలను నెరవేర్చింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ బృందానికి నా తరఫున, …

Read More »

పాఠశాలల ఆధునికీకరణలో పెను విప్లవం-మన బడి నాడు నేడు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలను ఒక పవిత్ర దేవాలయంగా భావించి అందులో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అకుంటిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్కూల్స్ లో పరీక్షా ఫలితాలను మెరుగుపరచడం, బడి బయట విద్యార్థుల సంఖ్యను తగ్గించి వారిని స్కూల్స్ లో చేర్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగాయి. …

Read More »

స్టేట్ లిటిగేషన్ పాలసీని సమర్థ వంతంగా అమలుచేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం…

-ఈ పాలసీని సమన్వయం,టైం బౌండ్ విధానంలో నిర్వహిస్తే కోర్టులపై ప్రభుత్వ లిటీగేషన్ల భారం తగ్గుతుంది… -ఎపి ఆన్ లైన్ లీగల్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ (APOLCMS) ప్రవేశ పెట్టడం ద్వారా వివిధ కేసుల డేటాబేస్ నిర్వహణకు అవకాశం… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తీసుకురానున్న స్టేట్ వ్యాజ్యం (Litigation) పాలసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ …

Read More »

పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో …

Read More »

సీఎం సహాయనిధికి నాలుగు కోట్ల రూపాయల విరాళం… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాడు నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్ల రూపాయల విరాళం. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కంపెనీ ప్రతినిధులు తెలియచేసారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధ‌వారం ముఖ్యమంత్రి …

Read More »

మైనారిటీల అభివృద్దికి విశేష కృషి : ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ఇటీవలి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా గుమ్మనూర్ జయరాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుమ్మనూర్ జయరాం కార్మిక శాఖ మంత్రి  బుధ‌వారం “ఆంధ్ర ప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు చైర్మన్ గా” పదవిని చేపట్టారు. చేపట్టిన వెంటనే CESS వసూలు పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ, కార్మిక శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఉమ్మడి కమిషనర్లు మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో CESS వసూలు పెంచడానికి అధికారులకు దిశా నిర్దేశం …

Read More »

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి: సీఎం  వైయస్‌.జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బుధ‌వారం సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ–టైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా …

Read More »