Breaking News

Tag Archives: amaravathi

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించం…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటి స్వాదీనానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ …

Read More »

మూడో వేవ్ ప్రచారం నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు-మాస్కు ధరిద్ధాం వైరస్ ను ఎదుర్కొందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ …

Read More »

నీతి, నిజాయితీ…నిబద్దత కు మారు పేరు ఉదయలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వృతి ఏది అయినా కావచ్చు, ఆర్ధిక పరిస్థితులు ఎలాగైన ఉండవచ్చు, అయితే నేమి తను నమ్ముకొన్న సిద్ధాంతం .. అన్నిటికి మించి నీతి, నిజాయితి జీవితాంతం నిలుస్తుంది…గుర్తింపు కుడా లభిస్తుంది దీనికి  బి. ఉదయలక్ష్మి తార్కారణం.. భర్త వో పోలీస్ అధికారి అయినా ఏనాడు కుడా కించిత్తు గర్వం లేదుకదా .. తన ముందున్న కర్తవ్యాన్ని తోటి అధికార యంత్రాంగం ద్వారా నడిపించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్డ్ అయిన  బి. ఉదయలక్ష్మి ని రాష్ట్ర …

Read More »

కోర్టు ధిక్కార కేసులపై తక్షణం స్పందించండి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టుల నుండి జారీ అయ్యే ధిక్కార కేసులు(కంటెంప్టు ఆఫ్ కోర్టు)పై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం,అఫీళ్ళకు వెళ్లడం వంటి చర్యలను యుద్ద ప్రాతిపదిక చేపట్టి ప్రభుత్వం వాదనన కోర్టులు దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన కంటెంప్టు …

Read More »

రాష్టస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి…

-స్పందన ఫిర్యాదుల స్వీకరణపై గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి… -ఫిర్యాదులను హేతుబద్ధంగా నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కారం స్పందన కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను రాష్ట్ర స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకూ సకాలంలో పరిష్కారం అయ్యేలా సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు …

Read More »

భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా చర్యలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్‌ పాస్‌’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్‌ పాస్‌’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన …

Read More »

ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …

Read More »

మాస్క్ ధరించండి…మానవాళిని కాపాడండి…

-బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము రాష్ట్రము, దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కదా అని ప్రతి మనిషి మాస్క్ ధరించకుండా సరదాగా వీధుల గుండా తిరుగుతున్నారు . అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను కలిసి నట్లయితే వందల మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 లో …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు-పశ్చిమ షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km మధ్య ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది . ఒడిస్సా తీరము & దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టము నుండి 2.1 km & 3.6 km ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పైన తెలిపిన ఉపరితల ఆవర్తనం వలన ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ …

Read More »

ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే… : పవన్‌ కల్యాణ్

-జనసేన బలోపేతానికి కృషి చేయాలి… -జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్‌ కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం  మాట్లాడుతూ ‘‘కరోనా విపత్తులో …

Read More »