-జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు
శ్రీరామనగరం (ముచ్చింతల్), నేటి పత్రిక ప్రజావార్త :
సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త. మే 11, 2026న జరగనున్న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. సైన్స్ మరియు టెక్నాలజీ (శాస్త్ర, సాంకేతిక) రంగంలో మానవాళి సాధించిన అద్భుతమైన ప్రగతిని వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Prajavartha Online Telugu News