విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమాన్ జయంతి సందర్భంగా పోతిన వెంకట మహేష్ పంచముఖ ఆంజనేయ ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ…ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పిల్ల రవి పుట్టినరోజు మరియు హనుమాన్ జయంతి సందర్భంగా రావి చెట్టు సెంటర్ సిద్దిక్ హాస్పిటల్ వద్ద 750 మందికి మజ్జిగ మరియు 750 ఐస్ క్రీమ్ ప్యాకెట్ పంపిణీలో పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు ఆవాల మారుతి,సైకం సాయిబాబు ,ఉత్తమ్చంద్ బండారి,కోరికని మల్లేశ్వర్ రావు,పైడిపాటి మురళి ,మాల మహానాడు అధ్యక్షులు వడ్లని శ్యామ్ సీనియర్ రాజకీయ నాయకులు గంగాధర్ ,తాట్రజూల నరేష్, బీసీ నాయకులు శీరం మల్లిబాబు చిట్టినగర్ నగరాల దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు మజ్జి శ్రీనివాసరావు యశ్వంత్ మిత్రులు నగరాల యువజన సంఘం నాయకులు శ్రీను తమ్మిన హరి పోతిన రమేష్ వెంకటేష్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ మరియు టీమ్ పోతిన మహేష్ నాయకులు నేమాల సంజీవరావు పొట్నూరి శ్రీనివాసరావు అడ్డూరి తమ్మారావు సిగినంశెట్టి రాము మద్దిల కనకరావు సాబింకర్ నరేష్ తమ్మిన రఘు తవ్వ మారుతి బంగారు నూకరాజు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News