గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 61 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సిహెచ్. శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. బుధవారం నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజంట్లను నియమించుకొని వివరాలను తమకు అందించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జరిగే సర్వేని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించి, సర్వే వేగవంతానికి సహకరించాలన్నారు. రాజకీయ పార్టీల సమావేశాల్లో కూడా ఈ జనగణన గురించి కార్యకర్తలకు, ప్రజలకు తెలిపి వారి వివరాలను జనగణన చేసే ప్రతినిధులకు అందజేయాలని తెలియచేశారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ రావు, త్రినాద్ (జనసేన), డి.జాన్ బాబు (వైఎస్ఆర్సీపీ), సిహెచ్.వాసు (బిఎస్పీ), ఎస్. కార్తీక్ (సిపిఐ), ఎస్ డి జాని బాషా (కాంగ్రెస్), ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ బాషా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News