విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం 55 వ డివిజన్ కు చెందిన కాస హేమ హాన్విక అనే చిన్నారి కి అనారోగ్య సమస్య వచ్చింది . మెరుగైన వైద్యం 5,65,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు టెలిపారు.. చిన్నారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. చిన్నారికి తక్షణమే వైద్యం అందించేలా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో చిన్నారి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు .కామ దేవరాజు, గంగాధర్. పెటేటీ రాజమోహన్ , ప్రదీప్ , సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News