Breaking News

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త :
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గవర్నర్ గురువారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్
పవన్ కళ్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి పవన్ కళ్యాణ్ తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్  కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *