Breaking News

జూలై ఒకటి నుండి జిల్లా గర్భవతులు, బాలింతలకు వేడి వేడి ఆహరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గర్భవతులు బాలింతలకు జూలై 1వ తేది నుండి వేడి వేడి ఆహరం అందించనున్నట్లు శిశు సంక్షమ శాఖ జిల్లా పాజెక్ట డైరెక్టర్‌ జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎనిమిది ఐసిడియస్‌ ప్రాజెక్టల పరిధిలో గల1475 అంగన్‌వాడి కేంద్రాలలో గర్భవతులు బాలింతలకు కోలిడ్‌ కారణముగా గత రెండు సంవత్సరాలు నుండి ఇప్పటి వరకు ఇంటి వద్దకే ఆహర పదార్థాల పంపిణీ చేస్తున్నాట్లు తెలిపారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు జూలై 1 వ తేది నుండి అంగన్‌ వాడీ కేంద్రాలలోనే వేడి వేడి ఆహరన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగందన్నారు. తల్లిబడ్డలకు మంచి పోషికాహరం అందించి ఆరోగ్యవంతంగా ఉంచేందుకు అందిస్తున్న వేడి వేడి ఆహరాన్ని గర్భవతులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ అధికారి ఉమాదేవి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *