జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో నివసిస్తున్న ప్రజలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యానగర్ కాలనీ లో ఇళ్ళు నిర్మించుకుని 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న విద్యానగర్ కాలనీ స్థలం దేవాదాయ శాఖ కు చెందిందని, వెంటనే ఆ స్థలాలను ఖాళీ చేయాలని ఆ ప్రాంత వాసులకు దేవాదాయ శాఖ …
Read More »Konduri Srinivasa Rao
బ్రాహ్మణ సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది…
-బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ సొసైటి పథకాలపై అవగాహన సదస్సులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు -కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు సేవలను కొనియాడిన మంత్రి -క్రెడిట్ సొసైటి.. బ్రాహ్మణుల బ్యాంకు : మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత పేద బ్రాహ్మణుల సహాయార్థం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. భవానీపురంలోని వీఎంసీ కళ్యాణ మండపంలో జింకా చ్రకధర్ అధ్యక్షతన బ్రాహ్మణ కార్పొరేషన్/ క్రెడిట్ …
Read More »విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చలనచిత్ర రంగంలో విలక్షణమైన నటనకు ఎస్వీ రంగారావు గారే స్ఫూర్తి అని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఎస్వీ రంగారావు 47వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు చిత్ర సీమలో ఎస్వీ రంగారావు వంటి మహానటులు మరలా రాబోరన్నారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి …
Read More »రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్.పి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎస్.పి బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఆదివారం మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ పుష్పగుచ్చం అందజేశారు.
Read More »బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల …
Read More »శ్రీ దుర్గమ్మ వారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ…
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ …
Read More »బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తాం…
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశాం… -కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు …
Read More »సామాజిక న్యాయమే లక్ష్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ …
-రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మొత్తం 135 నామినేటెడ్ పదవులు భర్తీ, వాటిలో 76 పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలకు ఇచ్చాం -ఈ ప్రభుత్వం. పదవుల భర్తీలో మహిళాలకు 50.4 శాతంతో మహిళలకు పెద్దపీట -అటు సంక్షేమం.. ఇటు సామాజిక న్యాయంలో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆధార్శంగా నిలిచింది -పదవులు అలంకారప్రాయం కాదు- ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సంస్కరణల్లో భాగం కావాలి -డా. అంబేడ్కర్ ఆశయ సాధన- సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యo -హోం మంత్రి సుచరిత -ప్రభుత్వ సలహాదారులు …
Read More »ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. స్థానిక లబ్బీపేట, పున్నంతోట, వెంకటేశ్వరపురం లలోని సచివాలయాలు శనివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలు …
Read More »కె. తాడేపల్లి అంభపురం సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం కె.తాడేపల్లి అంభపురం సచివాలయాలను శనివారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయంలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరిగైన సేవందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ …
Read More »
Prajavartha Online Telugu News