Breaking News

Daily Archives: January 7, 2025

కుల గణన జాబితాపై సవరణల అర్జీలకు జనవరి 12 వరకు గడువు పెంపు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుల గణన జాబితాలో సవరణలకు మంగళవారం ఆఖరి రోజు అని గతంలో ప్రకటించామని, ప్రజలకు మరింత గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం జనవరి 12 వరకు పొడిగించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి అయిన కుల గణన జాబితాలను 2024 డిశంబర్ 26న నగరంలోని 206 వార్డ్ …

Read More »

ఈ నెల 12 నుండి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జిఎంసి సంక్రాంతి సంబరాలు

-మంగళవారం స్టేడియంలో సంబరాల బ్రోచర్ ని ఆవిష్కరించిన నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్లు, అధికారులు -అధికారులు, ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులతో సంబరాల నిర్వహణ కమిటి ఏర్పాటు -12 వ తేదీ నుండి 15 వరకు తెలుగు సంప్రదాయాలను నేటి తరానికి తెలిపిలే అంగరంగ వైభవంగా జిఎంసి సంక్రాంతి సంబరాలు -తంబోలా, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, లెమన్ & స్పూన్ పోటీల్లో పాల్గొనే వారు …

Read More »

భారత ప్రధాన మంత్రి 08.01.2025న వైజాగ్ నుండి క్రిస్ సిటీ కి (KRIS City) వర్చువల్ గా శంకుస్థాపన

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 08.01.2025న వైజాగ్ నుండి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్ (KIN) అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులతో కలిసి శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నొడ్ వివరాలు: 1) ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ …

Read More »

ఆవిష్కరణలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుతాయి

-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., -156 వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే తరాలకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులు నూతన ఆలోచనలకు నాంది పలుకుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ 2024-25ను మంగళవారం విజయవాడ మురళి రిసార్ట్స్ లో …

Read More »

విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కలెక్టర్ డిఆర్ఓ కే చంద్రశేఖరరావు లతో కలిసి మచిలీపట్నం బచ్చుపేట లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నెంబర్ 4 సందర్శించి, విద్యార్థినీలకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, పేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్ …

Read More »

ఎస్సీ కులగణ‌నపై 12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ

-జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్ర‌క్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ  తెలిపారు. జనవరి,07వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు కుల‌గ‌ణ‌న‌పై …

Read More »

ఇటీవల కండ్రికలో రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్.కే. జాఫర్ షరీఫ్ కు ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన వల్లూరు భార్గవ్ గారి ఆర్థిక సౌజన్యంతో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి.గురునాధం, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు చేతుల మీదుగా ఇటీవల కండ్రికలో రోడ్డు ప్రమాదానికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్ కే జాఫర్ షరీఫ్ కు విజయవాడ నగర కాంగ్రెస్ కార్యాలయం నందు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. తదననంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి.గురునాథం  మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేసిన వల్లూరు …

Read More »

ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం

-రూ.92 కోట్లతో కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి -మదర్ డైరీ, శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో 8 వేలమందికి ఉద్యోగాలు -టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు -40 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాల -కుప్పం సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ‘నన్ను గుండెల్లో పెట్టుకుని ఇంతవాణ్ణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణకుప్పం విజన్ -2029 డాక్యుమెంట్ రూపొందించా. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ …

Read More »

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 213

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకు పాలనా సందర్భంగా రెవిన్యూ సదస్సులు జరుగుతున్న నేపధ్యంలో గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను …

Read More »

ఫేలికాన్ పక్షులు, ఫ్లెమింగో తదితర పక్షులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు

తడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణ నేపథ్యంలో తడ మండలం భీములవారి పాలెం సమీపంలోని పులికాట్ సరస్సు నందు సందర్శకుల కొరకు బోటింగ్ ఏర్పాటు, వారి భద్రత తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 బోట్లు ఏర్పాటు చేయాలని, బోటులో ప్రయాణించే ప్రతి ప్రయాణికునికి లైఫ్ జాకెట్ తప్పకుండా ఉండాలని, అలాగే సెక్యూరిటీ ప్రమాణాలు పాటించాలని, ప్రతి బోటుకు ఇద్దరు గజ ఈతగాళ్ళను …

Read More »