Breaking News

Daily Archives: January 17, 2025

నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ (SEEDAP) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20-01-2025 వ తేదీన నల్లపాడు …

Read More »

నగరాభివ్రుద్దికి సీనియర్ సిటిజన్స్ సూచనలు సలహాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివ్రుద్దికి సీనియర్ సిటిజన్స్ సూచనలు సలహాలు ఎంతో దోహదపడతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్ తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వివిధ రంగాలలో ఎంతో అనుభవం సాధించి ఉంటారని, అటువంటి వారి సూచనలు సలహాలు నగరాభివ్రుద్దికి ఎంతగానో అవసరమన్నారు. ప్రధానంగా పారిశుధ్యం, త్రాగు నీటి సరఫరా, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పార్కులు, …

Read More »

ప్రతి నెల 3వ శనివారం స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో నగరంలోని వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్గించి, సదరు కార్యక్రమాలకు ప్రోటోకాల్ మేరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్ కార్యక్రమాల నిర్వహణపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ …

Read More »

చెత్త సేకరణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలి

-విజయవాడ నగర పాలక సంస్కరించార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : చెత్త సేకరణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, ప్రతిరోజు నిత్యం వ్యర్థ సేకరణ కచ్చితంగా జరుగుతుండాలని, విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 21వ డివిజన్, కృష్ణలంక ప్రాంతం మొత్తం పర్యటించి క్షేత్ర స్థాయిలో పరీసశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యం వ్యర్థ సేకరణ జరుగుతుండాలని, ఆ …

Read More »

కుష్ఠు వ్యాధి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

-ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20 తేదీ నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే రెండవ సారి లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ (LCDC)లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం సంచాలకులు డాక్టార్ కే పద్మావతి తెలిపారు. ఈ కార్యాక్రమంలో అర్బన్ ఏరియా , గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆశా మరియు ఎఎన్ ఎం …

Read More »

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ ఉద్యోగులు, కార్మికులు, వామపక్ష పార్టీలతోసహా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు గత 4 సంవత్సరాలుగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. …

Read More »