-జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి -స్వాతంత్య్ర స్ఫూర్తి ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, వివిధ శాఖలు తమకు …
Read More »Daily Archives: August 10, 2026
నా సంకల్పం… నా దేశం కోసం!
– ఆగస్టు 10 నుంచి 15 వరకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమం – సమాజంలోని ప్రతిఒక్కరూ కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములు కావాలి – ఇంటింటా జాతీయ జెండా… ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించేందుకు “Partners in …
Read More »ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం
-మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల -ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేత -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటోగ్రాఫర్ల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పోటీలకు మొత్తం 221 ఛాయాచిత్రాలు ఎంట్రీలలో పంపగా , వాటిలో మూడు కేటగిరీలకు సంబంధించిన 27 …
Read More »పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి
-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకంతో పీజీఆర్ఎస్ ద్వారా తెలియజేస్తున్నందున, ప్రతి అర్జీని తమ సొంత సమస్యగా భావించి సత్వర, నాణ్యమైన పరిష్కారం …
Read More »గిరిజన సంస్కృతి పరిరక్షణతో పాటు విద్య, ఉపాధికి సమప్రాధాన్యత
-గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం -గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, నృత్య రీతులను పరిరక్షించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు
-ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఆగస్టు 17 నుంచి 29 వరకు నిర్వహణ -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు ఎంపిక చేయబడిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు …
Read More »సామాజిక భద్రతలో ఏపీ దేశానికే ఆదర్శం
-సంక్షేమం–అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి -క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి: దేవినేని ఉమా మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్చార్జిల శిక్షణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనిట్ ఇన్చార్జిలకు పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీకి బూత్, యూనిట్ ఇన్చార్జిలే క్షేత్రస్థాయిలో …
Read More »చాగంటిపాడులో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాల పంపిణీ -రూ.9.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -చాగంటిపాడు తూర్పు డొంక రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు -జల జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో రూ.50 లక్షలు మంజూరు -గ్రామంలో మిగిలిన సిమెంట్ రోడ్ల కోసం రూ.18.65 లక్షలు మంజూరు చేశాం : ఎమ్మెల్యే -చాగంటిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: యార్లగడ్డ -గత ఎన్నికల్లో 327 ఓట్ల మెజారిటీ ఇచ్చిన చాగంటిపాడు ప్రజలకు …
Read More »ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలి..
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు …
Read More »పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పునరుద్ధరించాలి
-లేనిపక్షంలో అనుమతుల రద్దు : వీఎంసీ ఫైర్ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, అగ్నిమాపక పరికరాల పనితీరుపై విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని నలిని గ్యాస్ట్రో హాస్పిటల్, పటమట లో రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన …
Read More »
Prajavartha Online Telugu News