Breaking News

Daily Archives: August 11, 2026

తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

-లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నతో వెల్లడైన వాస్తవాలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ధరల సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బహిర్గతం చేసిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన మార్కెట్ జోక్యం, కొనుగోలు వ్యవస్థను అమలు చేయకపోవడంతో రైతులకు క్షేత్రస్థాయిలో కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.6 వరకు మాత్రమే ధర లభించిందని తెలిపారు. తోతాపురి రైతుల సమస్యలపై ఎంపీ …

Read More »

కోట ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

-తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధి, నెల్లూరు జిల్లా కోటలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి లేఖ రాశారు. గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. …

Read More »

ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకి వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ  తంగెళ్ల ఉద‌య్ శ్రీ‌నివాస్‌ వినతి పత్రం అందించారు. మంగళ వారం ఢిల్లీలో ప్రహ్లాద్ జోషితో ఎంపీలు భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన …

Read More »

ఏఐ ఆధారిత పన్నుల నిర్వ‌హ‌ణ విధానంలో అగ్ర‌గామిగా ఏపీ

-ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాన్ని అభినందించిన జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌న్నుల నిర్వ‌హ‌ణ విధానంలో కృత్రిమ మేథ‌స్సు, డేటా ఆధారిత విశ్లేష‌ణ‌ల‌ను వినియోగించుకోవ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్ర‌గామిగా ఎదుగుతూ మిగ‌లిన రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తోంది. ప‌న్నుల నిర్వ‌హ‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సును ఉప‌యోగించుకుంటున్న తీరును అధ్య‌య‌నం చేయ‌డానికి జీఎస్టీ కౌన్సిల్ స‌భ్యులు ప్ర‌త్యేకంగా రాష్ట్రానికి వ‌చ్చారు. జీఎస్టీ కౌన్సిల్ సెక్ర‌ట‌రియేట్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి పంక‌జ్ కుమార్సింగ్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి డి.పి. మిశ్రాల‌తో కూడిన బృందం సోమ‌వారం రాష్ట్ర వాణిజ్య‌ప‌న్నుల శాఖ …

Read More »

లోకేశ్ అంటే జగన్ కు భయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ గొడ్డలి పార్టీ డ్రామాలు -రుజువులు ఉంటే అసెంబ్లీకి రావాలి -జగన్ వి చిల్లర రాజకీయాలు -ప్రజలు అసహ్యించుకుంటున్నారు -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి సవిత గుంతకల్లు/అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ‘జగన్ కు మంత్రి నారా లోకేశ్ అంటే భయం… అందుకే, ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు… నీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు …

Read More »

త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల‌కు మహిళా డ్రైవర్లు

-మహిళా సాధికారతలో మరో ముంద‌డుగు.. -తల్లీబిడ్డల సేవల్లో అత్యాధునిక సౌకర్యాల క‌ల్ప‌న‌ -తప్పుడు లెక్కలతో వైకాపా దుష్ప్రచారం -డీఎస్సీ నియమాకాలపైనా ఆ పార్టీ వైఖ‌రి గ‌ర్హ‌నీయం -మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వ‌జం -నరసరావుపేటలో నూతన అత్యాధునిక 102 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి -ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 300 వాహనాలు ప్రారంభం మ‌రో రెండు నెల‌ల్లో 200 కొత్త వాహ‌నాల్ని సిద్దం చేస్తామ‌ని వెల్ల‌డించిన మంత్రి న‌ర‌స‌రావుపేట‌, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 …

Read More »

ఢిల్లీ లేపాక్షి షోరూమ్‌ను సందర్శించిన చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

-వ్యాపారాన్ని పది రెట్లు పెంచేలా సమగ్ర మార్కెటింగ్ వ్యూహం రూపొందించాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, గత నెల 17వ తేదీన పునఃప్రారంభించిన ఢిల్లీలోని లేపాక్షి షోరూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్‌లో కొనసాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విక్రయాలు, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ విధానం, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని …

Read More »

సమాఖ్య-2026 కార్యక్రమానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో ఈరోజు జరగనున్న సమాఖ్య-2026 కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్  న్యూఢిల్లీలోని ఎంపీ సాన సతీష్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, IRS అధికారి PV రావు,  నరసింహమూర్తి తదితరులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

ఇంటింటికీ తెలుగుదేశం ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ధి… : బొండా రవితేజ

-ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే ఏకైక నాయకుడు MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 64వ డివిజన్ కండ్రిక K3 అపార్ట్మెంట్స్ వెనుక నుండి నాలుగు స్తంభాల సెంటర్ వరకు మంగళవారం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమం  తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొండా రవితేజ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను …

Read More »

102 ఉచిత సేవ తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా… : ఎమ్మెల్యే బొండా ఉమా

-పేదల ఆరోగ్యానికి పెద్దపీట.. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం -తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ సేవలకు ఆధునిక సాంకేతికత జోడింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద ఈరోజు “తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్” నూతన వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం …

Read More »