Breaking News

Daily Archives: August 11, 2026

సేంద్రియ వ్యవసాయంతో భూసారం పెంపొందించాలి

-అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం -ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి -రైతులకు కేటాయించిన కోటా మేరకు ఎరువులు అందుబాటులో ఉంటాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రం, బయో రిసోర్స్ సెంటర్, పిఎసిఎస్‌లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. పొన్నవరం గ్రామంలోని రైతు సేంద్రియ వ్యవసాయ …

Read More »

ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

-అంగన్వాడీ పిల్లలకు బాలామృతాన్ని విధిగా అందించాలి -పిల్లల పోషణపై తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని సక్షం అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం, పాఠశాలలో సౌకర్యాలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోషకాహార లోపం కారణంగా ఎత్తుకు …

Read More »

ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

-భూ యజమానులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి -భూసేకరణ అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాలు వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ఎర్రుపాలెం – నంబూరు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం వద్ద రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను జిల్లా …

Read More »

ఆగస్టు 12 నుండి “ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026” ప్రారంభం…

-బి.స్మరణ్ రాజు, ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, అవగాహన మరియు 95-95-99 లక్ష్యాల సాధన దిశగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీఎస్ఎసిఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026” నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాడేపల్లి కార్యాలయం నుండి ఈ …

Read More »

స్వాతంత్ర వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలతో సమాంతరంగా నిర్వహిద్దాం

-ఆగస్టు 15న ఎన్టీఆర్ జిల్లా పతాకావిష్కరణలో పాల్గొననున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ -ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వానికి తావులేదు -వర్షాకాలం దృష్ట్యా రైన్‌ప్రూఫ్ టెంట్లు, తాగునీరు, వైద్య శిబిరం, విద్యుత్ తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయి వేడుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. వేడుకలకు …

Read More »

మైనారిటీల సంక్షేమానికి మరింత బాధ్యతగా పనిచేస్తా… : కూరపాటి జాన్ పాల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​ప్రధానమంత్రి నూతన 15 పాయింట్ల కార్యక్రమం కింద మైనారిటీల సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలో సభ్యునిగా కూరపాటి జాన్ పాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కమిటీ సభ్యులు జాన్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు.ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ పథకాల అమలును కాలానుగుణంగా పర్యవేక్షించనుందన్నారు. ​తనపై …

Read More »

‘స్వచ్ఛ గుంటూరు’ దిశగా జిఎంసి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పారిశుధ్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను విప్లవాత్మకంగా విస్తరించిందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పిన్పాయింట్ షెడ్యూళ్లు, సిబ్బంది నిబద్ధతతో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే పారిశుధ్య పనులు ప్రారంభమై, 7 గంటలకల్లా ప్రధాన రహదారుల శుభ్రం పూర్తయిన …

Read More »

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి మౌళిక వసతులపై క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి కబాడీగూడెం, సంగడిగుంట, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

నెలాఖరులోగా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో శానిటేష‌న్ ఏజెన్సీల సిబ్బందికి ముఖ ఆధారిత హాజ‌రు త‌ప్ప‌నిస‌రి చేయాలి

-ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, శానిటేష‌న్ ఏజెన్సీల వారు పరస్పరం సమన్వయంతో పనిచేయాలి -మంత్రి సత్యకుమార్ వెల్లడి -ఆసుపత్రుల్లోని పరిస్థితులపై 3 గంటలపాటు సమీక్షించిన మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త పరిశుభ్రత మరిoత మెరుగుపడేందుకు ఆసుపత్రుల సూపర్డెంట్లు, ఏజెన్సీ వారు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. వైద్యుల హాజ‌రు, వారందించే సేవ‌లు, మందుల ల‌భ్య‌త ప‌ట్ల ప్ర‌జ‌ల సంతృప్త స్థాయికి త‌గ్గ‌ట్లుగా ప‌రిశుభ్ర‌త విష‌యంలోనూ సానుకూల‌త‌ పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. …

Read More »

ఆగస్టు 15న జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ చేపట్టండి…

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15వ తేదీన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శాఖలన్నింటిలో జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత 12 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజానీకం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ, విద్యా, వైద్య రంగాలు …

Read More »