Breaking News

Daily Archives: September 10, 2026

“ఆత్మహత్యల నివారణ” పై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయమునకు అనుసంధానమైన, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ విభాగము, ఏర్పాటు చేయబడి, పనిచేయుచున్న సందర్భమున, “ఆత్మహత్యల నివారణ” పై అవగాహన సదస్సులు, వివిధ కళాశాలలో మరియు వివిధ ప్రాంతాల్లో జరపడం జరుగుతున్నది. జిల్లా మానసిక ఆరోగ్య ప్రోగ్రాం యొక్క కార్యక్రమాలకు, ప్రోగ్రాం అధికారిగా, డాక్టర్ మీనా డి.ఎం.హెచ్వో.పరిధిలో పనిచేయుచున్నారు. ప్రపంచ “ఆత్మహత్యల నివారణ దినోత్సవం” సందర్భంగా, 09-09-2026వ తేదీన విజయవాడలోని వై.వి. రావు సిద్ధార్థ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో, ప్రధానోపాధ్యాయులు …

Read More »

మానసిక ఒత్తిడి రహిత జీవనమే సంపూర్ణ ఆరోగ్యం

-విజయవంతంగా మానసిక ఆరోగ్య అవగాహన, శిక్షణ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో తీవ్రమవుతున్న మానసిక ఒత్తిళ్లను జయించడానికి ప్రణాళికాబద్ధమైన జీవనశైలి, సమయపాలన అత్యంత అవసరమని ప్రముఖ మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం మానవ అభివృద్ధి సెల్ ఆధ్వర్యంలో ఆకర్ష ఫౌండేషన్ భాగస్వామ్యంతో జరిగిన స్ట్రెస్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్త నవితాశ్రీ.. …

Read More »

నందిగామలో ఈ నెల 11న ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం

-నందిగామ నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక నెల – ఒక నియోజకవర్గo – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. నందిగామ మధిరరోడ్డులోని ఆర్.ఎస్ గార్డెన్స్ నందు ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో ఏపీ బీజేపీ ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్ కన్వీనర్ పీయూష్ దేశాయ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య , బుల్లా విజయ్ కుమార్, శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం చైర్మన్ పోతిన భేసు కంటేశ్వరుడు, కార్యాలయ కార్యదర్శి …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు

-ఎన్డీయే కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్. -సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్ కన్వీనర్ పీయూష్ దేశాయ్ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష తెలిపారు. అర్హులైన …

Read More »

బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల జరుగుతున్న వివక్షత పై చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ రచయిత సామాజికవేత్త డి వి బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం బ్రాహ్మణ సామాజిక పెద్దలతో కలిసి బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా వేదికలు,(విజయవాడ. తిరుపతి. విశాఖపట్నం) ద్వారా తీసుకున్న నిర్ణయాల నివేదికపత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బి.జే.పి.అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ కి విజయవాడ, సీతారాంపురంలోని వారి కార్యాలయంలో కలిసి అందచేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల జరుగుతున్న వివక్షతను, నివేదికలో పొందుపరిచిన అంశాలను వివరించి, తీసుకోవలసిన …

Read More »

బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం.. ఆసుపత్రికి భారీ జరిమానా

-సిబ్బందికి అవగాహన కల్పించిన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. నిర్మల గ్లోరీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాల్సిందేనని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ స్పష్టం చేశారు. సూర్యారావుపేటలోని సతీష్ గ్యాస్ట్రో హాస్పిటల్‌లో గురువారం సాయంత్రం ఆమె బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేర్వేరుగా సేకరించకుండా అన్ని రకాల వ్యర్థాలను ఒకే …

Read More »

వర్షపు నీరు రహదారుల పైన నిలవకుండా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం వర్షం కురిసిన నేపథ్యంలో పాలిక్లినిక్ రోడ్డు, బందర్ రోడ్, బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్ రోడ్, ప్రాంతాలలో లో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా డ్రెయిన్లు, కల్వర్టులు, క్యాచ్‌పిట్లు తదితరాలను నిరంతరం పరిశీలించి, ఎక్కడైనా అడ్డంకులు ఉన్నట్లయితే వెంటనే తొలగించాలని సూచించారు. నీటి నిల్వ ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, వర్షం కురిసిన వెంటనే నీటిని …

Read More »

ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో విస్తృత తనిఖీలు

-బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు పాటించని 8 సంస్థలకు నోటీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ నిర్మల గ్లోరీ సూచనల మేరకు, 40వ డివిజన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ, సిబ్బందితో కలిసి గురువారం డివిజన్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా భవానిపురం, క్రాంబే రోడ్ ప్రాంతాలలో గల ఆసుపత్రులు, క్లినిక్‌లలో బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, నిల్వ …

Read More »

శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నగర పరిధిలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఎస్టేట్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలో శిథిలావస్థలో ఉన్న ప్రైవేట్, పబ్లిక్ భవనాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన కమిషనర్, నిర్మాణపరంగా స్థిరత్వం లేని, ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం సీజ్ చేయడంతో …

Read More »