ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్ ను గురువారం హిమాలయాలకు చెందిన112 ఏళ్ల వయస్సు గల సంత్ సదానందగిరి స్వామీజీ, సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు సిబ్బందితో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. జీవితంలో టీ, అక్షరమే కీలకం స్వామీజీ తన ప్రసంగంలో విద్యార్థులకు ఒక వినూత్నమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్ అక్షరం టీ, తో మొదలయ్యే హ్యూమానిటీ సిన్సియారిటీ వంటి మంచి గుణాలను అన్వేషించాలని వాటిని జీవితంలో ఆచరించాలని ఆయన బోధించారు. 112 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎంతో ఉత్సాహంగా యవ్వనంగా కనిపించడం పట్ల విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విలువల విద్యకు చిరునామా…
ఈ సందర్భంగా డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు, మాట్లాడుతూ విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాల రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కేతన కొండ సైనిక్ స్కూల్ మెంటార్షిప్ లో కొనసాగుతోందని తెలిపారు. ఇక్కడ కేవలం మార్కులు ర్యాంకులే కాకుండా గుర్రపు స్వారి విలువిద్య తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలతో పాటు శారీరక మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల చేతివ్రాత హ్యాండరైటింగ్ మెరుగుపరచడానికి ప్రత్యేక టీచర్ను నియమించి ఏడేళ్ల పాటు శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
ప్రవేశాల్లో వెసులుబాటు
సైనిక్ స్కూల్లో చదివితే కేవలం మిలిటరీకే వెళ్లాలనే నిబంధన ఏమీ లేదని విద్యార్థులు తమకు నచ్చిన వృత్తిని డాక్టర్ ఇంజనీర్ సివిల్స్ ఎంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఐదో తరగతిలో ఇక్కడ చేరిన విద్యార్థులకు ఆరో తరగతి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 60 శాతం సీట్ల రిజర్వేషన్ సుమారు 72 సీట్లు ఉంటుందని తక్కువ మార్కులు వచ్చినా సీటు పొందే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో 40 ఏళ్ల వయస్సులో వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడి ప్రస్తుతం స్వదేశంలో సేవ చేస్తున్న డాక్టర్ అనిల్ ప్రసాద్, పిరమిడ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు మాస్టర్ ట్రైనర్ విజయసారధి తదితరులు పాల్గొని విద్యార్థులకు మానసిక ప్రశాంతత ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ పవిత్రమైన కార్యక్రమం పాఠశాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని యాజమాన్యం పేర్కొంది.
Prajavartha Online Telugu News