Breaking News

దుగ్గిరాల మండల కేంద్రంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాల మండల కేంద్రము రైలుపేట లోని డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం నాయకులు కేకే కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఎంపీపీ దానబొయిన సంతోష రూపవాణి, దుగ్గిరాల గ్రామ సర్పంచ్ కుషి భాయ్, పెరుకలపూడి సర్పంచ్ గాంపల గంగాధర్ , నాయకులు కంభంపాటి క్రాంతి కుమార్, పార్టీ జిల్లా బిసి సెల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, దాసరి వీరయ్య, నుతలపాటి కేశవరావు , షేక్ జానీ బాషా , వడ్డేస్వరపు రజినీ కాంత్ , రత్నం , పిల్లి ధర్మరత్నం, నలుకుర్తి ఏసుపాదం, నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *