రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ముందుగా గౌతమి జీవ కారుణ్య సంఘమును సందర్శించి వసతులను పరిశీలించి, వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహవాసులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.టి. బాలికల సంక్షేమ వసతి గృహం, ఎస్.సి. బాలికల సంక్షేమ వసతి గృహం, ఎస్.టి. బాలుర సంక్షేమ వసతి గృహం, బి.సి. బాలుర సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, భోజనశాలలను, పరిసరాలను, నివాస గదులను పరిశీలించారు. విద్యార్ధులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలియ చెప్పారు.
Prajavartha Online Telugu News