రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కే జాన్ వెస్లీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమించడం పట్ల కే. జాన్ వెస్లీ కి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని కే జాన్ వెస్లీ తెలియ చేశారు. ఈ సందర్భంలో కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News