-మోడల్ STP గా అభివృద్ధి:-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్ -3 పరిధిలోని కృష్ణలంక 15, మరియు 16 వ డివిజన్ రామలింగేశ్వర నగర్ లోని తడి చెత్త నుండి విధ్యుత్ ఉత్పత్తి చేయు బయో మెథనైజేషన్ ప్లాంట్ మరియు మురుగునీటిని శుద్ధి చేయు 20 యం.ఎల్.డి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సోమవారం ఉదయం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ప్లాంట్ ఆవరణలో గల ల్యాబ్, సి.సి రోడ్లు మరియు కాంపౌండ్ వాల్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. 20 యం.ఎల్.డి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ యొక్క పునరుద్ధరికరణ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రతి ప్లాంట్ ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆయా ప్లాంట్లను నిర్వహించినట్లయితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండుటయే కాకుండా ఆయా ప్లాంట్ లలో సి.సి రోడ్లు మరియు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. విజయవాడ నగరం ఆహ్లాదకరంగా మరియు ఆరోగ్యకరంగా ఉండుటకు ప్రజలు కూడా సహకారం అందించి ఎవరు కూడా రోడ్లపై లేదా డ్రెయిన్ లలో చెత్త మరియు వ్యర్దములు పడవేయరాదని పిలుపునిచ్చారు.సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ వైపు గణనీయమైన పురోగతిలో, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నగరం అంతటా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (STPs) నిర్మించడానికి ప్రశంసనీయమైన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగిందని కమిషనర్ అన్నారు. 135 కోట్లతో మంజూరైన మొత్తంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మురుగునీటి నిర్వహణ యొక్క క్లిష్టమైన సమస్యను పరిష్కరించడం మరియు స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు.యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) సహకారంతో, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్కు నిధులు అందించింది. ఈ నిధులు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడ్డాయి మరియు అదనపు బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్లను స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ సంస్థ నుండి వచ్చిన ఈ ఆమోదం స్థిరమైన పద్ధతులను అవలంబించడంలో మరియు పర్యావరణ సవాళ్లను తగ్గించడంలో విజయవాడ యొక్క ప్రయత్నాల యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందని అన్నారు.ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News