Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173 వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు రాజమహేంద్రవరం ఘనంగా నిర్వహణ

-వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంద -యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి -మంత్రి ఎస్ సవిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమందరం ఇచ్చే ఘన నివాళి అని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి రాష్ట్ర …

Read More »

రాజమహేంద్రవరం నూతన ఆర్డీవోగా ఆర్. శివ రాముడు బాధ్యతల స్వీకారం

-కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా పూల బొకే అందజేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా సోమవారం ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించిన ఆర్. శివ రాముడు అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆర్. …

Read More »

జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులు రాజీ ద్వారా పరిష్కారం – చెక్కుల అందచేత/ పంపిణీ, అవార్డులు జారీ -18,441 కేసులు పరిష్కారం రూ.58.16 కోట్ల పరిహారం చెల్లింపు – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కక్షిదారులు సామరస్యం, సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో ఎల్పీజీ సరఫరా సజావుగా కొనసాగుతోంది – వినియోగదారులు ఆందోళన చెందవద్దు

-జిల్లాలో రోజుకు 12 వేలకుపైగా గ్యాస్ సిలిండర్ల సరఫరా – అవసరానికి మించి బుకింగ్లు చేయవద్దు -సాధారణ కంటే 90 శాతం పెరిగిన గ్యాస్ బుకింగ్లు – FIFO విధానంలో సిలిండర్ల డెలివరీ కొనసాగుతోంది -గోకవరం, విశాఖపట్నం, విజయవాడ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి సజావుగా ఎల్పీజీ సరఫరా : కలెక్టర్ కీర్తి చేకూరి -వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ – హెల్ప్ లైన్ 8074661259 : కలెక్టర్ కీర్తి చేకూరి -తప్పుడు సమాచారంతో అధిక బుకింగ్లు చేయవద్దు – అవసరమైతే మాత్రమే …

Read More »

కొవ్వూరు మినీ బస్టాండ్ ఆక్రమణల తొలగింపు… : జిల్లా ప్రజా రవాణా అధికారి వై.వి. మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు గ్రామంలో బ్రిడ్జి టోల్ గేట్ సమీపంలో గామన్ బ్రిడ్జి హైవే ద్వారా పయనించే ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ దిశలకు వెళ్లే ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఆగేందుకు ఏర్పాటు చేసిన మినీ బస్టాండ్ వద్ద జరిగిన ఆక్రమణలను తొలగించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వై.వి. మూర్తి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కొవ్వూరు మినీ బస్టాండ్ వద్ద పూల దుకాణం, ఇతర వ్యాపారాల కోసం స్థలాన్ని ఆక్రమించడంతో ప్రయాణికులు ఎండలో నిలబడాల్సి వస్తోందని, …

Read More »

జాతీయ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

-జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులు రాజీ ద్వారా పరిష్కారం – చెక్కుల అందచేత/ పంపిణీ, అవార్డులు జారీ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కక్షిదారులు సామరస్యం, సంధి చేసుకునే నైజం కలిగి లోక్ అదాలత్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రంతా డ్రోన్ లతో ప్రత్యేక నిఘా.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాత్రి సమయంలో జిల్లాలో అసాంఘిక శక్తులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలని లక్ష్యంగా డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా అంతట ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవించడం ,గంజాయి సేవించడం,పేకాట, ఈవిటిజింగ్, చైన్ స్నాచింగ్, జూదం తదితర నేరాల పై ప్రతిరోజు రాత్రి సమయాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం …

Read More »

14 సంవత్సరాల బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం

-పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిని ముందుగానే నివారించేందుకు 14 సంవత్సరాల బాలికలకు ఒక డోసు HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. HPV వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉండగా, టీకా ద్వారా దీనిని సమర్థవంతంగా …

Read More »

మహిళల సమస్యల ఫిర్యాదుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా జన్ సున్వాయి స్పెషల్ డ్రైవ్

-మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయం -మార్చి 12 ఆర్ అండ్ బి అతిథి గృహం – నూతన సమావేశ మందిరంలో – జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయు రాయపాటి శైలజ ది.12.03.2026 తేదీన R&B Guest House new meeting Hall …

Read More »

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ ద్వారా 205 అర్జీలు స్వీకరణ – జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్‌) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి మొత్తం 205 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. విభాగాల వారీగా అందిన అర్జీల్లో రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) కు 87, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 57, హోం శాఖకు 11, ఎనర్జీ శాఖకు 8, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు 5, …

Read More »