విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేదారేశ్వర పేట ఎర్రకట్ట డౌన్ నందు చేపట్టిన పార్క్ అభివృద్ధి పనులను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు. 35 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్క్ అభివృద్ది పనులు 15 రోజులు పూర్తి చేయాలన్నారు. 150 మీటర్లు వాకింగ్ ట్రాక్, ఇతర సివిల్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా పార్క్ నందు గ్రీనరీ పనులతో పాటు ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్ …
Read More »Tag Archives: vijayawada
వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయండి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-అందుబాటులో 15000 వ్యాక్షిన్లు… -డిజిటల్ అసిస్టెంట్ డేటా అప్లోడ్ చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న మోగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్ సూచించారు. నగర పాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం 54వ డివిజన్ మహమద్ అల్లిపురం వార్డ్ సచివాలయo నందు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, పలు సూచనలు చేశారు. నగరంలో 286 సచివాలయల్లో 15000 వ్యాక్షిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నగరంలో నిర్వహించే …
Read More »చెడు మీద మంచి విజయం సాధించడమే గీతా సారాంశం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఉత్తమ జీవన విధానానికి ‘భగవద్గీత’ స్ఫూర్తినిస్తుంది -శ్రీ కృష్ణ పరమాత్ముని ఊరేగింపు మహోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక మార్గనిర్దేశం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా బాల గోపాలుని ఊరేగింపు మహోత్సవం ఆంధ్రప్రభ కాలనీలో కన్నులపండువగా జరిగింది. ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని …
Read More »సిఎంఎస్ శ్రీలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ సిఆర్ఎంయు నేతలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ప్రధాన ఆసుపత్రిలో ఇన్ చార్జ్ సిఎంఎస్ గా విధులు నిర్వహిస్తున్న ఎండి నజీర్ హుస్సేన్ స్థానంలో ప్రస్తుతం లాలగూడలో విధులు నిర్వహిస్తున్న డా.శ్రీలక్ష్మి విజయవాడలో సిఎంఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్ సిఆర్ఎంయు డివిజన్ కార్యదర్శి జిఎన్.శ్రీనివాసరావు, అధ్యక్షులు లీల, మెడికల్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె షౌకద్ అలి, అసిస్టెంట్ కార్యదర్శి తిరుపతి స్వామి, ఛైర్మన్ విజయ మాణిక్య తదితరులు మర్యాద పూర్వకంగా సిఎంఎస్ శ్రీలక్ష్మిని …
Read More »ఆంధ్ర పరిశ్రమలు భేష్…
-పాట్ సైకిల్-2 లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్ర పరిశ్రమలు -పాట్ సైకిల్ 2 వివరాలు వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ -3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్ నకు సమానమైన (0.295 ఎంటీఓయి ) ఇంధనం ఆదా -దీని విలువ సుమారు రూ 2,350 కోట్లు -1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల -పాట్ సైకిల్ 2 లో ఆంధ్ర ప్రదేశ్ అద్భుతమైన పని తీరు — అభయ్ బాక్రే , డైరెక్టర్ జనరల్ …
Read More »టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలకు గవర్నర్ అభినందన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో పారాలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అవని లేఖారాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జావెలిన్ త్రోలో రెండవ స్వర్ణ పతకం సాధించినందుకు సుమిత్ ఆంటిల్, హైజంప్లో వెండి పతకం సాధించిన నిషద్ కుమార్, పురుషుల డిస్కస్ త్రోలో వెండి పతకం సాధించిన యోగేష్ కథునియా సేవలను క్రీడా లోకం మరువదన్నారు. జావెలిన్ …
Read More »మాజీ సైనికుల సహకార ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి… : కమాండర్ మేజర్ జనరల్ ఆర్.కె.సింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సహకార ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జనరల్ ఆఫీస్ కమాండర్ మేజర్ జనరల్ ఆర్.కె.సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం నగరంలో గవర్నర్ పేట అరండాల్ పేటలోని మాజీ సైనికుల సహకార ఆరోగ్య కేంద్రాన్ని(ఇ సి హెచ్ ఎస్ పాలీక్లినిక్) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆఫీసర్ ఇంచార్జి కల్నల్ పాలేటి రాంబాబు స్వాగతం పలికి పాలీక్లినిక్ సిబ్బందిని పరిచయం చేసారు. మాజీ సైనికులకు కోవిడ్ …
Read More »పరిక్ష కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనై షన్ లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్,అకౌంట్స్ ఆఫీసర్ల ఉద్యోగ నియమాకల కోసం సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం యుపిఎఎస్ సి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష ఏర్పాట్లను సోమవారం సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇందు కోసం విజయవాడ నగరంలో కృష్ణవేణి స్కూల్, మెరిస్ స్టెల్లా కాలేజీ, పి.బి.సిద్దార్థ కాలేజీ, శ్రీ దూర్గ్స్ మల్లేశ్వర సిద్దార్థ మహిళ కళాశాల్లో ఏర్పాటు చేసిన పరిక్ష కేంద్రాలను ఆయన పరిశీలించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పై …
Read More »మెగా వాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లో మంగళవారం నిర్వహించే మెగా వాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ రురల్ మండలం పాతపాడు,రామవర్పడు-1 సచివాలయాలను ఆయన సందర్శించారు. పాతపాడు సచివాలయంలో మెగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణ ఏర్పాట్లుపై జరిగిన సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నిర్వహించే కోవిడ్ టీకాలు వేసే మెగా డ్రైవ్ నూరు శాతం విజయవంతం …
Read More »నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం… : జిల్లా కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లావ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని(డీ-వార్మింగ్ డే) ఈనెల 31 న మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్త్య మరియు పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ఆగష్ట్ 31న డీ – వార్మింగ్ డే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాల విద్యార్ధులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ 400 మి.గ్రా) నమిలి తినిపించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతీ అంగన్వాడి …
Read More »
Prajavartha Online Telugu News