-విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు నగర మేయర్ భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తో కలసి 5 గురికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు అధికారులు మీ యొక్క …
Read More »Tag Archives: vijayawada
యం.కె బేగ్ స్కూల్ లో మధ్యాహ్నం భోజనం చేసిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…
-నాడు నేడు పనుల ద్వారా స్కూల్స్ అభివృద్ధి -ఎమ్మెల్సీ ఎం.డీ కరీమున్నిస్సా తో కలిసి పర్యటించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో జగనన్న గోరు ముద్ద మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, నాడు నేడు పథకంలో భాగంగా నగరంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. బుధవారం ఎమ్మెల్సీ కరిమునీస్సా నగరపాలక సంస్థ …
Read More »UPSC Test Series పోస్టర్ ను ఆవిష్కరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతూ రానున్న అక్టోబర్ నెల 10వ తారీఖున UPSC-2021 ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన UPSC Test Series కు సంబందించిన పోస్టర్ ను కమీషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ .ఎ.ఎస్ విడుదల చేశారు. ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు U.P.S.C Test Series ఉచితంగా అందిస్తున్నట్లు విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ విజయ కుమార్ తెలిపారు. మాక్ టెస్ట్ సిరీస్ ప్రతి శని, ఆదివారము విద్యాదర్శిని ఐ …
Read More »రాజకీయలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు…
-జగనన్న ప్రభుత్వం రూ.600కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు… -51 లక్షల సిపి రోడ్డు నిర్మాణ పనులకు శుంకుస్థాపన… -దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వంలో రాజకీయలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నది అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం నగరంలో 54వ డివిజన్ పరిధిలో రూ.35.00 లక్షల అంచనా వ్యయంతో గాంధీ బొమ్మ సెంటరు నుండి ఖాదర్ సెంటరు వరకు ఏర్పాటు చేయనున్న …
Read More »సీఐఐ-ఐజీబీసీ నుండి ‘‘మోస్ట్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టు’’ అవార్డు అందుకున్న రాయనపాడు వ్యాగన్ వర్క్షాపు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వేలో నిరంతరం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాయనపాడు వ్యాగన్ వర్క్షాపుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) వారిచే ‘‘మోస్ట్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టు’’ అవార్డు లభించింది. వ్యాగన్ ఓవర్హాలింగ్లో చేపట్టిన ఉత్తమమైన వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాయనపాడు వర్క్షాపుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించింది. ‘‘ఎన్విరాన్మెంట్ బెస్ట్ ప్రాక్టిస్-2021’’ 8వ సీఐఐ జాతీయ అవార్డు కోసం జులై నెలలో …
Read More »అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రజలకు ఇక్కట్లు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-23 వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన… -నక్కలరోడ్డులో అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థపై సీరియస్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ నక్కలరోడ్డు ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థపై ఫిర్యాదులు అందడంతో శాసనసభ్యులు స్థానికంగా పర్యటించారు. వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి చిలుకు దుర్గయ్య వీధిలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. చుట్టుప్రక్కల …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభం…
-ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం మారుతీనగర్ అల్లూరి సీతారామరాజు వంతెన సెంటర్ వద్ద 26వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని శాసనసభ్యులు మల్లాది విష్ణు డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణం పరిష్కరించేదుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలపై డివిజన్ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. వారికి భరోసా …
Read More »కృష్ణాజిల్లాలో మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం… : కలెక్టర్ నివాస్
-లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు -అధికారులు, సిబ్బందిని అభినందించిన కలెక్టర్ నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో మంగళవారం నిర్వహించిన మెగా వాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. లక్ష్యానికి మించి 1,34,931 మందికి టీకాలు వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసిన ఎఎన్యం, ఆశ కార్యకర్తలు, విఏఓలు, వీఆర్వోలు, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. వాక్సినేషన్ మండల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, వైద్యులకు కలెక్టర్ నివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read More »కవులూరు గ్రామంలో నీటిపారుదల సమస్య పరిష్కారం కోసం సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో నీటిపారుదల సమస్య పరిష్కారం కోసం మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కవులూరు గ్రామంలో పంట కాలువలు నీటి పారుదల సమస్యతో రైతులు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వినతి మేరకు జలవనరుల శాఖ ఇంజినీర్లు, మండల సర్వ్ …
Read More »విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో పలు సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో మంగళవారం మర్యాదపూర్వకంగా నేడు ఎమ్మెల్సీ ఎండీ కరి మున్నిసా గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం విజయవాడ నగరంలో పలు సమస్యలపై కమిషనర్ తో ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంభందిత అధికారులను విజయవాడ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రుహుల్లా …
Read More »
Prajavartha Online Telugu News