విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కు చెందిన తలకోల భారతి జీర్ణాశయ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు అత్యవసర వైద్యం కోసం 4,00,000/- రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించడంతో ఆమెకు అవసరం అయిన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ ను బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 39 వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకుడు నరేంద్ర రాఘవ సుజనా మిత్రలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News