Breaking News

ప్రజలందరికీ ఆరాధ్యుడైన డా. బాబాసాహెబ్ అంబేడ్కర్.

-అంబేడ్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
-రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ ఆరాధ్యుడైన భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ అని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరు లోని మంత్రి వర్యుల క్యాంప్ కార్యాలయంలో, మెరకవీధిలో గల విగ్రహానికి అంబేడ్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయం లో చిత్ర పటానికి మరియు మెరక వీధిలో విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, డా బి ఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత గానే కాకుండా, ప్రముఖ భారతీయ న్యాయవాది, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్య భారత దేశపు మొట్టమొదటి కేంద్ర న్యా యశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా పని చేశారని ఆమె కొనియాడారు. పూలే రచించిన పుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ఆయన భావజాలంతో సువిశాల భారత దేశానికి ఒక రక్షణ కవచం వంటి రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అందజేశారన్నారు. దేశంలోని అన్ని వర్గాల వారు సంఘటితంగా, ప్రశాంతంగా జీవించేలా అంబేడ్కర్ మహనీయుడు రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా లిఖించారన్నారు. పూలే, అంబేడ్కర్ భావజాలం తోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే లక్ష్యంతో నవరత్నాలు పథకాల ను అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృ ష్ణ, కొవ్వూరు మున్సిపల్ ఛైర్పర్శన్, బావన రత్న కుమా రి, వైస్ చైర్ పర్సన్, గండ్రోతు అంజలీ దేవీ,మాజీ యం. యల్. ఎ, టి. వి. రామారావు, బండి పట్టాభి రామారావు, రు త్తల భాస్కర రావు, కౌన్సిలర్లు అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, తదితర నాయకులు కార్యక ర్తలు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *